దియా మిర్జా ఫోటో గ్యాలరీ
చర్చలపైనీలినీడలు?
హైదరాబాద్:ప్రభుత్వానికి, పీపుల్స్వార్కుమధ్య ప్రారంభమైన చర్చలపైనీలినీడలు అలుముకుంటున్న సూచనలుకనిపిస్తున్నాయి. గ్రీన్టైగర్స్, రెడ్టైగర్స్ వంటి సాయుధ అజ్ఞాతదళాల వివాదం, వరంగల్ జిల్లాలోఒడ్డుగూడెం సంఘటన అనంతరపరిణామాలు చర్చలను ఏ వైపుమళ్లిస్తాయోననే అనుమానాలువ్యక్తమవుతున్నాయి.
వరంగల్జిల్లా ఒడ్డుగూడెం సంఘటనపై లక్ష్మణ్పేర మీడియాకు అందిన లేఖ,పీపుల్స్వార్ నేత రఘు అనే పేరుమీద వెలువడిన లేఖ అయోమయాన్నిసృష్టించే ప్రమాదం ఉన్నదనిభావిస్తున్నారు. లెటర్ హెడ్ మీదకాకుండా తెల్లకాగితంపై రఘు పేరప్రకటన వెలువడింది. అతను చర్చలవిషయంలో అనుమానాలు రేకెత్తించేప్రకటనలు చేశాడు. పీపుల్స్వార్ప్రతినిధులుగా శంకరన్,బొజ్జాతారకం, పొత్తూరివెంకటేశ్వరరావు,కన్నాభిరాన్ల పేర్లనుప్రకటించడం గద్దర్,వరవరరావులకు ఇష్టం లేదనిఅన్నాడు. ఆ పేర్లు ప్రకటించకుండావీరిద్దరూ పీపుల్స్వార్ నేతలుగణపతిపై, రామకృష్ణపై ఒత్తిడితెచ్చారని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. అలాగేచర్చలను విఫలం చేయడానికి గద్దర్,వరవరరావుప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించాడు.పీపుల్స్వార్ను అధికారిక ప్రకటనఏదైనా వెలువడే వరకు ఈ ప్రకటనసృష్టించిన అయోమయంకొనసాగుతూనే వుంటుంది.