హైదరాబాద్:
విద్యుత్
సంస్కరణలు
మొట్టమొదట
1993లో
ఒరిస్సా
రాష్ట్రంలో
ప్రారంభమయ్యాయి.
అంటే
మిగతా
రాష్ట్రాల్లో
కన్నా
అది
ముందున్నది.
సంస్కరణల
వల్ల
సంభవించబోయే
పరిణామాలను
అర్థం
చేసుకోవాలంటే
ఒరిస్సా
అనుభవాలను
ఒక్కసారి
పరిశీలిస్తే
సరిపోతుంది.
విద్యుత్
సంస్కరణల
తీరులో
రాష్ట్రాన్ని
మార్పు
లేనందున
అలా
చూడడం
వల్ల
ఏ
విధమైన
పొరపాటు
జరిగే
అవకాశం
లేదు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర
విద్యుచ్ఛక్తి
బోర్డు
(ఎపిఎస్ఇబి)
ఎపి
ట్రాన్స్కో,
ఎపి
జెన్కోలుగా
చీలిపోవడంతో
రాష్ట్రంలో
విద్యుత్
సంస్కరణల
అమలు
మొదలయింది.
విద్యుత్
ఛార్జీల
పెంపుతో
దాని
ప్రభావం
కనిపించడం
ప్రారంభమైంది.
చాలా
మంది
హెచ్చిరిస్తున్నట్లుగానే
స్వయం
ప్రతిపత్తి
గల
ఎలక్ట్రిసిటీ
రెగ్యులేటరీ
కమిషన్
ఏర్పడి
కరెంట్
చార్జీలను
అనూహ్యంగా
పెంచేసింది.