హైదరాబాద్:
నామినేటెడ్
పదవుల
భర్తీకి
నాయకత్వంమళ్లీ
కసరత్తులు
ప్రారంభించిందన్నసమాచారంతో
అధికార
తెలుగుదేశం
పార్టీశ్రేణులలో
ఆశలు
మోసులెత్తుతున్నాయి.
చంద్రబాబునాయుడునేతృత్వంలో
తెలుగుదేశం
పార్టీ
తిరిగిఅధికారంలోకి
వచ్చి
తొమ్మిది
నెలలు
గడుస్తున్నా
ఇంతవరకు
తమకుపదవులు
దక్కలేదన్న
ఆవేదన
పార్టీకార్యకర్తలలో
వుంది.
ఇటీవలికాలంలోప్రభుత్వపరంగా
ఆయా
కార్యక్రమాలు
నిర్వహిస్తున్నాక్యాడర్
అంత
ఉత్సాహంగా
పాల్గొనకపోవడానికి
ఇది
కూడా
ఒక
కారణం
అన్న
అభిప్రాయం
ఉంది.
ఎప్పటికప్పుడురేపోమాపో
అన్న
చందంగా
ఊరించడమే
కాని
పదవులు
మాత్రం
రావడంలేదని
కార్యకర్తలు
వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతిసారి
పత్రికలలో
నామినేటెడ్
పోస్టులు
ఇవ్వబోతున్నారని
ప్రచారం
రావడం,
ఒకటో,
అరో
పదవులు
ఇవ్వడం,
దాంతో
పొలోమని
వివిధ
ప్రాంతాల
నుంచి
కార్యకర్తలుహైదరాబాద్
తరలి
వచ్చి
నేతలను
కలిసి
తమ
అర్హతలను
వివరించి
పదవుల
కోసం
అభ్యర్థించడం
అలవాటుగా
మారింది.
ఒక్కోసారి
పత్రికల్లో
ఇలాంటి
వార్తలువచ్చినప్పుడల్లా
ఇక్కడకు
వచ్చే
ఒక్కో
కార్యకర్తకువెయ్యి
రూపాయలైనా
ఖర్చు
అవుతోందనితెలుగుదేశం
మాజీ
మంత్రి
ఒకరు
చెప్పారు.తెలుగుదేశంలో
ఈ
వ్యవహారం
అంతా
భలే
తమాషాగా
సాగుతుంది.