వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2010 - ఆంధ్రప్రదేశ్ రౌండప్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
సెప్టెంబర్
01- చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట కొత్త విమానాశ్రయానికి శంకుస్థాపన
- లాటరీల నిర్వహణపై హైకోర్టు నిషేధం
17- హజ్ యాత్రకు 17 లక్షల మంది భారతీయులకు అనుమతి
18- 20 రైళ్ల నెంబర్లను మార్చాలని నిర్ణయించిన రైల్వే శాఖ
29- తెలంగాణ ఉద్యమంలో ముందుండాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం
- ఖరీఫ్ పంట నష్ట నివారణకు రూ.699 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం
30- ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుకు యావజ్జీవ శిక్ష

ఆక్టోబర్

01- ఆర్జీత సేవా టిక్కెట్ల కుంభకోణంలో క్రిమినల్ కేసులు
- విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత హోంశాఖకు ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశాలు
- కాంగ్రెస్ పార్టీకి జగనే దిక్కు అంటూ మాజీ మంత్రి కొండా సురేశ వ్యాఖ్య
- అధికారికంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం
- 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ గా తులసిరెడ్డి నియామకం
- తిరమల ఆలయంలో డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసిని టిటిడి ఇఒ కృష్ణారావు
- గుంటూరు డిఆర్సీలో మంత్రులను నిలదీసిన తెదేపా ప్రజాప్రతినిధులు
- సత్యం రాజు బెయిలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్
- 02- దేశవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో రోబో విడుదల
- సిఆర్పీఎఫ్ డైరెక్టర్ గా విజయ్ కుమార్
- ఉద్యమాల నియంత్రణ, ఉపాధి అవకాశాల పెంపు ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
- నిమ్స్ నుంచి రామలింగరాజు డిశ్చార్జ్
- తెలంగాణ కోసం మరో ఫ్రంట్, గద్దర్ ప్రత్యేక్ష కార్యాచరణ
- గిరిజనుల పోరాటానికి మద్దతునిస్తూ శ్రీకాకుళం పాలకొండలో సిపిఎం సమావేశం
03- ఇవిఎంలపై గళమెత్తిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పయనం
- హైదరాబాదును రెండవ రాజధానిగా ప్రజలు కోరుతున్నారంటూ జస్టిస్ సుభాషణ్ రెడ్డి వ్యాఖ్య
- శ్రీవారి హుండీలో బుల్లెట్.. రెండవ వైకుంఠం వద్ద భక్తులపై విజిలెన్సు దాడి
- సింహాచలం భూముల వేలంపాట నిలుపు చేయాలని ముఖ్యమంత్రిని కోరిన సిపిఐ రాఘవులు
- పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరెడ్డి హ్యాట్రిక్
04- ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ప్లీనరీపై పోలీసుల దాడి
- ఈవిఎంలపై చంద్రబాబు పోరాటానికి 26 పార్టీల మద్దతు
- 19.7 శాతం పెరిగిన రాష్ట్ర ఆర్థిక స్థితిపై ముఖ్యమంత్రి హర్షం
- ఒకే ఛత్రం కింద శ్రీవారి సేవలు
- 1900 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం
- సింగరేణి కార్మికులకు 16శాతం బోనస్
- రాష్ట్ర రాజధానిలో సుప్రీంకోర్టు బెంచ్ కోరుతూ సాధన సమితి ఆవిర్భావ ం
- రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఐదువేల రూపాయల జరిమానా
05- పిసిసి కార్యదర్శి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్... ప్రతాప్ రెడ్డికి షోకాజ్
- గజదొంగ అడపా వెంకన్న ఎన్ కౌంటర్
- రామలింగరాజును మూడుగంటలు విచారించిన సిబిఐ
- వైఎస్ జగన్, కెవిపిలపై చర్యలకు హైకమాండ్ కసరత్తు
- కొండా సురేశపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టాన వర్గానికి డిఎస్ నివేదిక
- ఒకే కాన్పులో నలుగురు కవలలు
- ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ నాదెండ్ల వెంకటేశ్వరరావు ఆత్మహత్య
- హైదరాబాదులో 2.15 లక్షల రూపాయల విలువైన కొకైన్ పట్టివేత
- స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు కేటాయిస్తూ తెదేపా నిర్ణయం
- విద్యాసంస్థల బస్సులకు మరిన్ని కండిషన్స్ విధించిన ఆర్టీఐ
- తిరుపతిలో టిటిడి అధికారుల వైఖరికిని నిరసనగా మీడియా బృందం నిరవధిక ధర్నా
06- జాతీయ విపత్తుల నివారణ సంస్థ సభ్యుడిగా క్యాబినెట్ హోదాలో మర్రిశశిధర్ రెడ్డి నియామకం
- ఎమ్మార్ ప్రాపర్టీస్ 532 ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల
- మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహం
- గంగవరంలో ఉపాధికోసం ఉద్యమించిన మత్స్యకారులు
- చేనేత కార్మికుల రుణమాఫీ చేస్తూ క్యాబినెట్ నిర్ణయం
- ముఖ్యమంత్రిని కలిసిన ఆస్ట్రేలియా మేయర్ల ప్రతినిధి బృందం
- శబరిమల యాత్రకు వెయ్యి ప్రత్యేక బస్సులు
- ఉస్మానియా వర్సిటీకి స్లెట్ నిర్వహణ బాధ్యతను ఇస్తూ ప్రభుత్వ నిర్ణయం
- మావోల కోసం హెలికాపట్ర్లతో భద్రతా సిబ్బంది వేట
07- పౌరహక్కుల నేత శంకరన్ కన్నుమూత
- ప్రభుత్వ పాఠశాలలో బాలల ఆరోగ్య రక్ష కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశం
- బెల్టు షాపులపై తెదేపా మహిళా ఉద్యమం
- గాంధీ ఆసుపత్రిలో 22 సుశృత ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం
08- తెలంగాణ భవన్ ముట్టడికి అమరవీరుల ఐక్య వేదిక ప్రయత్నం
- భూదానం భూములను కాపాడేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని అఖిలపక్షాల డిమాండ్
- సచివాలయానికి కట్టుదిట్టమైన భద్రత
- ప్రారంభమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
9- శ్రీరాంసాగర్ జలాలు ఇవ్వాలంటూ పొన్నాల ఇంటి ముందు మోత్కుపల్లి ధర్నా
- తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా గద్దర్, 85 మందితో అడ్ హక్ కమిటీ
- శ్రీశైలం వద్ద లోయలో పడిన కాలేజీ బస్సు, ఇద్దరి మృతి
- బెల్టు షాపులపై తెదేపా రాష్ట్రవ్యాప్త ధర్నాలు
- మోక్రోఫైనాన్సుకు ముగ్గురు బలి
10- ఢిల్లీకి చేరిన ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గ విస్తరణపై చర్చ
- ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ రగడ.. 1.5 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
11- అనంతలో పడగ విప్పిన ఫ్యాక్షనిజం.. తెదేపా నేత హత్య
- అవినీతి మంత్రులను తొలగించాలని సోనియాకు రాయపాటి లేఖ
- రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్సు ఎరువుల సరఫరాకు అంగీకరించిన కేంద్రం
- అటవీ భూములను ఆక్రమిస్తే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన మంత్రి పెద్దిరెడ్డి
12- జగన్ అడ్వాన్సు టాక్సు 84 కోట్ల రూపాయలు
- మైక్రో ఫైనాన్సు సంస్థల ఆగడాలపై ఆర్డినెన్సుకు ప్రభుత్వం నిర్ణయం
- కనకదుర్గమ్మకు రెండు కేజీల బరువు ఉన్న బంగారు వీణ కానుక
13- ముఖ్యమంత్రిలో శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి దుగ్గల్ భేటీ
- గోపాల మిత్ర గౌరవ వేతనాలను పెంచిన ప్రభుత్వం
- మైక్రో ఆగడాలపై అఖిలపక్షాల ధ్వజం.. అరికట్టాలని ప్రభుత్వానికి నిన్నపం
14- మైక్రో ఫైనాన్సుపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లను ఆదేశించిన సిఎం
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ల గల్లంతుపై విచారణ
- పశుక్రాంతి పథకం అమలుకోసం కమిటీ నియామకం
- సచివాలయం వద్ద డిఎస్సీ 2008 అభ్యర్థుల ఆందోళన, అరెస్టు
- ఓపెన్ మార్కెట్ విధానంలో మిల్లర్ మాఫియాకు చెక్ పెట్టేందుకు యత్నం
15- మైక్రో ఆర్టినెన్సుకు గవర్నర్ ఆమోదం, టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు
- శ్రీవారిని దర్శించుకున్న సిఎం
16- దళిత రిజర్వేషన్ల బిల్లుకు సిఫారసు చేసిన ప్రభుత్వం
- ఖమ్మం జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో లోయలో పడిన లారీ.. ఏడుగురు మృతి
- గ్రామాలకు పర్యాటక శోభ ఇచ్చేలా ప్రభుత్వ ప్రోత్సాహకాలు
17- ఆంధ్రప్రభ దినపత్రిక ప్రధాన కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రోశయ్య
- విశ్వసనీయ వార్తలకు ప్రతీక ఆంధ్రప్రభ అంటూ అభినదించిన సిఎం
18- ఏడాదిలోగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తామన్న కాకా
19- యూనివర్శిటీ ఆప్ హైదరాబాదు క్యాంపస్ లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటరీ రీసెర్చ్ క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్
- ప్రధాని అప్పాయింట్ మెంటు కోసం తెదేపా ధర్నా
- ఎమ్మార్ ప్రాపర్టీస్ కు రెండు నెలల గడువు ఇచ్చిన ఏపిఐఐసి
20- ఖమ్మంలో కానిస్టేబుల్ రైఫిల్ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
- బియ్యం ఎగుమతికి అనుమతి నిరాకరించిన రోశయ్య
- అమరజవాన్లకు డిజిపి నివాళి
- మైక్రో ఆర్డినెన్సుపై రిట్ లను స్వీకరించిన హైకోర్టు
- స్వాతంత్ర్య సమరయోధుడు పాగ పుల్లారెడ్డి కన్నుమూత
21- తెలంగాణ అంశం వీధుల్లో తేలేది కాదన్న ముఖ్యమంత్రి
- ఏడాదిలో లక్షన్నర ఐటి ఉద్యోగాలు వస్తాయని ఇన్ఫోసిస్ సిఈవో గోపాలకృష్ణన్
- సచివాలయం వద్ద డిఎస్సీ అభ్యర్థుల ఆందోళన అరెస్టు
- ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఆధ్వర్యంలో ఐ బ్యాంకు
- రైళ్లకు కొత్తగా ఐదు అంకెల నెంబర్లు
- సిఎంను కలిసిన కేంద్ర ఆహార, పౌరసరఫరల శాఖ సహాయమంత్రి కెవి ధామస్
22- స్థానకి సంస్థల మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గుంటూరులో ప్రకటించిన ముఖ్యమంత్రి
- మైక్రో లావాదేవీలకు అనుమతినిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- ఎస్కెయు విసి కుసుమ కుమారిని తొలగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు
- ఉన్నత విద్యకు అదనంగా 32 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం
23- మహబూబ్ నగర్ లో తెలంగాణ అమరవీరుల రభ రసాభాస
- తెలంగాణకు సోనియా అనుకూలమే అంటూ కాంగ్రెస్ నేతల ఉద్ఘాటన
- యువతను రాజకీయాల్లోకి అహ్వానించిన చంద్రబాబు
- విజయవాడ పర్యటన రద్దు చేసుకున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి
లలిత కళాతోరణం పేరు మార్పు యోతనను విరమించుకున్న ప్రభుత్వం
24- కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో భారత ఆర్చరీ కోచ్ లెనిన్ సహా తొమ్మిది మంది దుర్మరణం
- హైదరాబాదులో లేడీస్ హాస్టల్ లో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి
- ఆహార భద్రత పథకాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి
- భూ వివరాలను సేకరించిన శ్రీకృష్ణ కమిటీ
- ఢిల్లీకి వెళ్లిన డిఎస్
- సమ్మె విరమించిన మిల్లర్లు
- గాంధీలో దీక్ష చేస్తున్న డిఎస్సీ అభ్యర్థులు క్షీణిస్తున్న ఆరోగ్యం
- తిరుమలలో సామాన్య భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యమని వెల్లడించిన సిఎం
25- తెలంగాణ కోసం ఢిల్లీలో తెదేపా ధర్నా, అరెస్టులు
హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదులు చేస్తున్న దీక్ష భగ్నం
- ప్రాణహిత పుష్కరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయన్న మంత్రి గాదె వెంకటరెడ్డి
- ఆర్టీసీలో 30,849 పోస్టుల భర్తీ చేస్తామని ఎండి ప్రసాదరావు వెల్లడి
- పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించిన ముఖ్యమంత్రి
26- శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
- సత్యం రాజుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసిన సుప్రీం
- ట్రిపుల్ ఐటి ప్రవేశాలపై మండల్ యూనిట్ గా తీసుకోవడం రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు సంచలన తీర్పు
- యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఇంట్లో ఐటి అధికారుల సోదాలు
- ఓబుళాపురం నుంచి ఐరన్ ఓర్ సరఫరాపై జిటెక్స్ సంస్థ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
- చిత్తూరులో విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
- స్కాలర్ షిప్ దరఖాస్తులకు నోటరీ రద్దు చేసిన ప్రభుత్వం
27- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా భన్వర్ లాల్
- విసిల నియామకానికి కొత్త ఆర్డినెన్సు తీసుకు వస్తామన్న గవర్నర్
- 2013లో అంతరిక్షంలోకి చంద్రయాన్-2ను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడి
28- వేత సవరణ కోసం అర్చకుల ఆందోళన
- 70:30 నిష్పత్తిలో డిఎస్సీ-2008 నియామకాలు చేస్తామని ప్రకటించిన మంత్రి మాణిక్య వరప్రసాద్
- రాష్ట్ర పరిస్థితులపై తాజా నివేదికతో ఢిల్లీకి వెళ్లిన గవర్నర్
- మెట్రో రైలు ప్రాజెక్టును సకారంలో పూర్తి చేయాలని సిఎం ఆదేశాలు
29- డిఎస్సీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- తెలుగు యూనివర్శిటీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు
- అలిపిరి దాడి కేసులో మావో ముద్దాయిలకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు
- పారిశ్రామికాభివృద్ధి దిశగా రాష్ట్రం ప్రగతి సాధిస్తున్నదని ముఖ్యమంత్రి వెల్లడి
30- ఉన్నత విద్యామండలి పూర్తి కాలపు చైర్మన్ గా జయప్రకాశ్ రావు
- ఈశాన్య రుతుపవనాల ఆగమనం.. భారీ వర్షాలు
- ఆర్టీసీలో 419 సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఖైదీల విడుదలకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
31- కోస్తాతీరం అతలాకుతలం ఏడు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం
- ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలకు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం

నవంబర్
01- తెలంగాణలో నిరసనల హోరు, సీమాంధ్రలో వేడుకల జోరు మధ్య రాష్ట్రావతరణ దినోత్సవం
- రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఇంటిపై దాడి
- ఉగ్రవాదుల సవాళ్లను తిప్పికొట్టాలని యువతకు గవర్నర్ పిలుపు
- డిఎస్సీపై కోర్టుకెక్కిన బీఇడి అభ్యర్థులు
02- జడ్చర్లలో వందకోట్ల రూపాయల వ్యయంలో ఎస్ఎంఐఎంఎస్ బిజినెస్ స్కూలు ఏర్పాటు
- గజల్స్ గానంతో మూడోసారి గిన్నిస్ లోకి శ్రీనివాస్
- ప్రతి పౌరునికి ఓటరులు గుర్తింపు కార్డు ఇస్తామని సిఇవో భన్వర్ లాల్ వెల్లడి
- విద్యామండలి వైస్ చైర్మన్ మూలవేతనం మూడురెట్లు పెంచిన ప్రభుత్వం
03- ముంచుకొస్తున్న జల విలయం.. కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు
- తుఫాన్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలన్న సిఎం
- ఓడరేవుల అభివృద్ధికి మెరీటైమ్ బోర్డు ఏర్పాటు, జిహెచ్ఎంసీ పరిధిలో క్రిమీలేయర్ వర్తించకుండా చట్ట సవరణ, మైక్రో రుణాలపై బిల్లు తీసుకు రావాలని క్యాబినెట్ నిర్ణయాలు
- ప్రారంభమైన డిఎస్సీ నియామకపు ప్రక్రియ
- మంత్రులు ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు లీక్ చేస్తున్నారని మండిపడ్డ సిఎం
- నల్లమలలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
04- ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి
- కోస్తాలో జలఖడ్గం దాటికి 38 మంది మృతి.. 3 లక్షల హెక్టార్లలో పంట నష్టం
- ప్రత్యేక పోలీసు ఆఫీసర్లుగా మాజీ సైనికులను నియమించాలని ప్రభుత్వ నిర్ణయం
05- వరదలతో కోస్తా తీర ప్రాంతాలు అస్తవ్యస్తం
- పోలీసుల అదుపులో పోతుల సురేష్
- రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
06- శాస్త్ర సాంకేతిక మండలికి 300 కోట్ల అదనపు నిధులు ఇచ్చేందుకు సిఎం అంగీకారం
- వరద ప్రాంతాల్లో తెదేపా నేత చంద్రబాబు పర్యటన
- బోగస్ కళాశాలలపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం
07- రాష్ట్రానికి తప్పిన జల్ గండం, చెన్నై ఉత్తర తీరాన్ని తాకి బలహీన పడిన తుఫాను
- ఆటోమోబైల్, స్టీల్, కెమికల్స్ ప్లాంటులకు భూములిస్తామని రతన్ టాటా కు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య
- తన సహనాన్ని పరీక్షించవద్దని నెల్లూరు సభలో వ్యాఖ్యానించిన వైఎస్ జగన్
08- వరద పీడిత ప్రాంతాల్లో పంటరుణాల రీషెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
- రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలని చంద్రబాబుకు సూచించిన రోశయ్య
- వీసీల వేటలో గవర్నర్
- హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల బంద్
- బంగారు సరికొత్త రికార్డు 20,335
- అల్పపీడనంగా మారిన జల్ తుఫాను
- ఉద్యోగ భద్రత కల్పించాలని వరంగల్ లో నర్సుల సమ్మె
09- వరద ప్రాంతాల్లో పర్యటించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి
- తూర్పు గోదావరి జిల్లాలో పేలిన ఓఎన్జీసి పైప్ లైన్
- కర్నూలు జిల్లా ఆత్మకూరులో మిద్దెకూలి ఐదుగురి మృతి
- రామలింగరాజుకు సుప్రీం కోర్టులో చుక్కెదురు, లొంగిపోవాలని ఆదేశం
- హార్టికల్చర్ కాలేజీలకు నాబార్డు నిధులు
10- మళ్లీ రాజుకున్న ఫ్రీజోన్ వివాదం
- పల్లెలకు ఐటి సేవలు విస్తరించాలని ప్రభుత్వ నిర్ణయం
- ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం ప్రవేశపెడుతూ ఇంటర్మిడియట్ బోర్డు నిర్ణయం
- హైకోర్టు ఆవరణను హై సెక్యురిటీ జోన్ గా ప్రకటించిన హైకోర్టు
- మొద్దుశీను హంతకుడు ఓంప్రకాశ్ కు జీవిత ఖైదు విధించిన అనంతపురం సెషన్సు కోర్టు
- లొంగిపోయిన సత్యం రామలింగరాజు, ఐదుగురు నిందితులు
- అడపా వెంకన్న హత్యకేసులో న్యాయవిచారణకై హైకోర్టు స్టే
11- తెలంగాణ కోసం కాంగ్రెస్ ను బలోపేతం చేస్తూ, జనవరి నెలాఖరు వరకు గడువు ఇస్తామన్న కెసిఆర్
- 8 మంది ఐఏఎస్ ల బదిల
- ఫిలిం టూరిజం సెల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- చంద్రుడిపై పూర్తిస్థాయిలో పరిశోధనకు ఇస్రో సన్నాహాలు
12- లార్జెస్టు బేర్ ఫుట్ వాక్ లో పాలమూరు వర్సిటీ గిన్నిస్ రికార్డు
- సోనియాకు మద్దతుగా పిసిసి భారీ ధర్నాలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య
- రోడ్లు, మంచినీటి పునరుద్ధరణకు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం
13- సినీ భీష్ముడు డివిఎస్ రాజు మృతి
- విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న లోక్ సభ స్పీకరు మీరా కుమార్
- తెలంగాణ కోసం అవసరమైతే పదవులు త్యాగం చేస్తామని ప్రకటించిన కెకె
14- బాలల ఆరోగ్యానికి బాల ఆరోగ్య రక్షణ పథకం ప్రారంభించిన ప్రభుత్వం
- ఏషియాడ్ లో బంగారు పథకాలు సాదించిన రాష్ట్ర క్రీడాకారులు
- మాజీ మంత్రి దండు శివరామరాజు మృతి
15- ఎస్ఐ పరీక్షలపై రగడ... డిజిపి కార్యాలయం ముట్టడి
- పోలవరంపై ఎంపీల గోల... నేదురుమల్లి ఇంట్లో తెలంగాణ, సీమాంధ్ర నేతల రభస
- పద్మ అరెస్టుతో అట్టుడికిన మన్యం
- మార్చి 15 తర్వాత ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం
- కాకినాడ కేంద్రంగా భారీ చెరుకు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అమెరికా సంస్థ
- రోశయ్య అభిమానులచే రోస్ సంస్థ ఏర్పాటు
- 294 కోట్లతో రోడ్లు పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం
- అటవీశాఖలో 517, కాలుష్య నియంత్రణ బోర్డులో 128 పోస్టుల భర్తీకి అంగీకరించిన సిఎం
16- ఎస్ఐ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.. ఉస్మానియాలో ఉద్రిక్తత
- నవరత్నాల్లో విశాఖ ఉక్కు
- అవినీతిపరులను కఠినంగా శిక్షించాల్సిందే అని కాగ్ కు గవర్నర్ కితాబు
17- తిరుపతి పర్యటనలో సిఎం, పరిస్థితుల కారణంగా సహనం కోల్పోతున్నా అన్న సిఎం
- తీరంలో మళ్లీ తుఫాను అలజడి
- పోలవరంగా ఢిల్లికీ వెళ్లాలని చిరంజీవి నిర్ణయం
- మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లో గీత కార్మికుడి లాకప్ డెత్
18- ఎస్ఐ పరీక్షల నిర్ణయం భగ్గుమన్న ఓయు
- మే మొదటివారంలో ఎంసెట్ నిర్వహణ, జెఎన్టీయుకే బాధ్యతనిచ్చిన ఉన్నత విద్యా మండలి చైర్మన్
19- పుట్టపర్తికి వచ్చిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
- ఎస్ఐ రాత పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం
- పార్టీయే సుప్రీం అంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి
- పేదల సంక్షేమమే కాంగ్రెస్ ద్యేయమని గుంటూరు సభలో వెల్లడించిన సిఎం
- 14మంది డిఎస్సీల బదలీ
- తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ
- 38 పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులకు ప్రిన్సిపల్స్ గా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం
20- సోనియాపై సాక్షి పత్రికలో కథనాలు, ఖండించిన కాంగ్రెస్ వర్గాలు
- త్వరలో ఎస్ఐ పరీక్షలు నిర్వహిస్తామని హోంమంత్రి హామీ
- మార్చి 7 నుంచి ఇంటర్, 24నుంచి పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధమైన ప్రభుత్వం
- మక్కా పేలుళ్ల నిందితుడు అసిమానందకు రిమాండ్
21 విజయవాడలో ఆర్యవైశ్యుల మహా సమ్మెళనం, పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య
- రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు
- రాష్ట్ర జనాభా 9 కోట్లకు చేరుకున్నదని తాజా నివేదికల వెల్లడి
22- సత్యసాయి జన్మదినోత్సవ వేడుకల్లో ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు
- పుట్టపర్తిలో సిఎంను అడ్డుకున్న జగన్ మద్దతుదారులు.. నేను రాజీనామా చేస్తే కడుపు మంట చల్లారుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం
- సీమలో చంద్రబాబు పర్యటన
- జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఊహాగానాలు
- తెదేపా ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
23- పుట్టపర్తినుండి నేరుగా ఢిల్లీకి వెళ్లిన రోశయ్య
- ఢిల్లీ టుర్ లో చంద్రబాబు, చిరంజీవి
- డిజిపి నియామకాన్ని తప్పు పట్టిన హైకోర్టు
- గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
- ఉద్యోగ సంఘాల చలో హైదరాబాద్
24- అత్యవసరంగా సిఎల్పీ సమావేశం, మొయిలీ, ఆజాద్ హాజరు
- ముఖ్యమంత్రి రోశయ్య రాజీనామా
- కొత్త ముఖ్యమంత్రిగా స్పీకర్ ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక
25- రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం
- రోశయ్య పథకాలు అమలు చేస్తానని కొత్త ముఖ్యమంత్రి వెల్లడి
- జగన్ ఇంట్లో మంత్లు, ఎమ్మెల్యేల భేటీ
- శాంతి, భద్రత, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తామన్న కిరణ్
26- ఐఎఎస్ లో ముఖ్యమంత్రి ముఖాముఖి
- మెదక్ జిల్లాలో ఫారెస్టు బీట్ అధికారి సజీవ దహనం
- 568 మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి
27- ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
- జగన్ పై చర్యకు క్రమశిక్షణా సంఘం సిఫారసు
- అత్యవసర సమయంలో ఆదుకునేలా కొత్త బ్లడ్ పాలసీని ప్రారంభించిన ప్రభుత్వం
- టెక్సుటైల్ రంగంలో ఐదులక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి పనబాక లక్ష్మి
28- సోనియాతో వైఎస్ వివేకా భేటీ.. మంత్రి పదవి కావాలని వినతి
- కొత్త క్యాబినెట్ పై సిఎం కసరత్తు
- సలహాదారు పదవికి రాజీనామా చేసిన కెవిపి
29- కాంగ్రెస్ పార్టీకి జగన్, విజయమ్మల రాజీనామాలు, సోనియాకు ఐదు పేజీల బహిరంగ లేఖ
- ఫ్యాక్సు ద్వారా అందిన రాజీనామాలను ఆమోదించమని స్పష్టం చేసిన స్పీకరు కార్యాలయం
30- వైఎస్ జగన్ తో వైఎస్ వివేకా చర్చలు, కుదరని సయోధ్య
- మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవ్వాలని కెసిఆర్ పిలుపు
- సిఎంఓలో కిరణ్ కొత్త టీమ్

డిసెంబర్
17- రైతుల కోసం చంద్రబాబునాయుడు నిరవధిక నిరాహార దీక్ష
21- రైతుల కోసం జగన్ 48 గంటల దీక్ష
22- దీక్ష విరమించిన జగన్
24- చంద్రబాబు దీక్షను విరమించాలని కోరిన జాతీయ పార్టీ నేతలు
- దీక్ష విరమించిన చంద్రబాబు
25- క్రిస్ మస్ పండుగ సందర్భంగా కేకు తినిపించుకున్న బాబాయ్ వివేకానంద, అబ్బాయ్ జగన్
26- బాబాయ్, అబ్బాయ్ ల మధ్య కుదరని సయోధ్య

1 | 2 | 3

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X