బుల్లితెర దాడుల'సీ'రియల్
రెండు దాడుల వెనక సెల్వరాజ్ అనే నటుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరాధన, తూర్పు పడమర, మొగలిరేకులు సీరియల్స్ లో సెల్వరాజ్ ను తీసేసి వేరే నటులను పెట్టారు. ఆరాధన, తూర్పు పడమర సీరియల్స్ లో సెల్వరాజ్ ను తీసేసి శ్రీధర్ వర్మను తీసుకున్నారు. తూర్పు పడమర సీరియల్ లో డింపుల్ నటిస్తోంది. మొగలిరేకులు, ఆరాధన సీరియల్స్ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. సీరియల్ మధ్యలో ఓ నటుడ్ని తీసేసి మరో నటుడ్ని పెట్టడం చాలా మంది జీర్ణం కావడం లేదు. సెల్వరాజ్ కు అభిమానుల సంఖ్య ఎక్కువే. మొగలి రేకులు సీరియల్ లో అతను విలనిజాన్ని పండించిన తీరు చాలా మందికి నచ్చింది.
సీరియల్స్ కు పెరుగుతున్న ఆదరణ, నటులకు పెరుగుతున్న ఆభిమానులు బుల్లితెరను కుదిపేస్తున్నట్లు చెబుతున్నారు. పెరుగుతున్న ఆదరణతో టీవీ ఆర్టిస్టుల్లో ఆధిపత్య పోరు అధికమైందని, దాడులకు అదే కారణం కావచ్చునని భావించే వారున్నారు. అయితే, సీరియల్స్ కు మరింత ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో కూడా దాడుల డ్రామాలను పండిస్తూ ఉండవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా, బుల్లితెర పరిస్థితి అంత సజావుగా లేదనే విషయం అందరికీ తెలిసిందే.