భారత్ దారులన్నీ తిరుమలకే
దేశీయ పర్యాటకులు 2009లో సందర్శించిన పది రాష్ట్రాలు వరుసగా ఇలా ఉన్నాయి - ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్. మొత్తం పర్యాటకుల్లో 88 శాతం మంది ఈ పది రాష్ట్రాలను సందర్శించారు. 2009లో 15.75 కోట్ల మంది భారత పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీవారి దయ వల్ల ప్రథమ స్థానంలో నిలిచింది. తిరుమల బాలాజీని సందర్శించిన తర్వాత పర్యాటకులు విశాఖపట్నం నగరానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాదు మూడో స్థానం ఆక్రమిస్తోంది. హైదరాబాదులో కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా ఉండడం వల్ల తమ భవిష్యత్తును వెతుక్కుంటూ యువతీయువకులు హైదరాబాదు వస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులో 500కు పైగా కంపెనీలున్నాయి. పర్యాటకుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2009లో 400 కోట్ల రూపాయలు ఆర్జించింది.