మనీషా కొయరాలాకీ సీన్ రివర్స్
1942 ఎ లవ్స్టోరి, బొంబాయి, దిల్ సే వంటి చిత్రాలతో ఒకప్పుడు యువతకు కలల రాణిగా వెలిగిన మనీషా కొయరాలాకి ఇప్పుడు ఏ వేషం ఇవ్వాలో దర్శకులకు,నిర్మాతలకు అర్దం కావటం లేదు.బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఆమె రీసెంట్ గా తమిళంలో మాప్పిళ్లయ్ అనే తమిళ చిత్రంలో హీరో ధనుష్కి అత్తగా నటించింది.అలాగే మలయాళ చిత్రం ఎలక్ట్రా లో నయనతారకు తల్లిగా యాక్ట్ చేసింది.అయితే ఆమెకు బాలీవుడ్ ఇంకా ఆహ్వానం పలకలేదు.దాంతో మనీషా ఇప్పుడు పాత్ర బాగుంటే అక్క, వదిన, అమ్మ పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నానని మీడియా ద్వారా తెలియచేసింది.
అంతేగాక తనను తాను ఎంగేజ్ చేసుకోవాటనికి ఈ మాజీ నేపాలీ బ్యూటీ దర్శకురాలిగా కూడా మారుతోంది.గౌతమ్ బుద్ధుడి జీవితాన్ని ఆధారం చేసుకుని ఓ చిత్రానికి దర్శకత్వం వహించటానికి రెడీ అవుతోంది.తనకు దాదాపు 75 చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో దర్శకురాలిగా తన తొలి చిత్రాన్ని ప్రేక్షక రంజకంగా తీయగలనని మనీషా చెప్తోంది.శ్రీలంక నిర్మాత నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.షూటింగ్ చాలా భాగం శ్రీలంక లోనే జరపుతారు.