సోనీ టివీ చేతుల్లోకి రామోజీరావు ఈటివి?
రామోజీరావు తన తమ మీడియా గ్రూపులోని ప్రాంతీయ భాషా చానళ్లలో కొంత వాటాను సోని గ్రూప్ కు అమ్మివేయనున్నారంటూ బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో ఓ కధనం వచ్చింది. దాని ప్రకారం రెండు కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇవి అడ్వాన్స్ డ్ దశలో ఉన్నాయని ఈ పత్రిక రాసుకొచ్చించది.అలాగే సోని గ్రూపునకు వాటాలను విక్రయించడం ద్వారా రామోజీ గ్రూప్ కు సుమారు 2400 కోట్ల రూపాయల వరకు సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు.ఇక ఈ ఒప్పదం కనుక ఖరారైతే,దేశంలోనే అతిపెద్ద డీల్ అవుతుందని బిజినెస్ స్టాండర్డ్ వ్యాఖ్యానించింది.
ఇక దేశవ్యాప్తంగా స్టార్,జీ చానళ్లను ఎదుర్కోవడానికి సోని ఈ నిర్ణయానకి వచ్చిందని సమాచారం.అయితే సోని సంస్థ అదికార ప్రతినిదికాని,ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, ఎమ్.డి కిరణ్ గాని ఈ విషయంపై ప్రస్తుతం స్పందించటానకి ఒప్పుకోవటం లేదు.ఇక ఈనాడు గ్రూప్ ఈ పెట్టుబడలు ఆహ్వానించటానకి కారణం ఇప్పటికే ఈనాడు గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన కంపానీ గ్రూప్ ను బయటకు పంపించివేయడానికే అని ఆ పత్రిక తెలిపింది.
ఇక కంపానీకి పెట్టిన రెండువేలఆరు వందల కోట్ల పెట్టుబడులకుగాను నలభై శాతం వాటాను ఇచ్చారు. ఇప్పుడు ఆ వాటాను సోనికి విక్రయించడంవల్ల ఈటివి ఛానల్ లో వార్తల స్లాట్ ను నిబంధనల ప్రకారం ఎత్తివేయవలసి ఉంటుందని అంటున్నారు. అయితే రామోజీ గ్రూప్ ఈటీవి-2 ని సోనికి విక్రయించడం లేదు.కాబట్టి వార్తా ఛానెల్ కి సమస్య రాదు.