నిత్య సంపన్నుడు నిజాం కింగ్: వరల్డ్లో టాప్ 6
సుమారు వెయ్యేళ్ల లెక్కలను తీసుకున్నా అంతకుముందు అంత సంపన్నులు ఎవరూ లేరని ఆ వెబ్ సైట్ పేర్కొంది. అందుకే చరిత్రలో అత్యంత సంపన్నుల జాబితా తాము రూపొందించిందే అయి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు భూమ్మీద జీవించిన తొలి పది మందిలో ఉస్మాన్ అలీ ఖాన్ ఆరో వ్యక్తి. భారత దేశంలో మొదటి వాడు. పదిమంది టాప్ వరల్డ్ ధనవంతుల జాబితాలో అలీ ఖాన్ మినహా భారత్కు చెందిన ఎవరూ లేరు. ఆయన ఆస్తుల విలువ రూ.11,80,000 కోట్లు.
ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా 14 శతాబ్దంలో మాలిని పరిపాలించిన మన్సా మూసా-1 అనే రాజు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.20,00,000 కోట్లు అని సదరు వెబ్ సైట్ తేలిపింది. ఈ వెబ్ సైట్ మొత్తం 24 మందిని అత్యంత సంపన్నులుగా గుర్తించింది. రెండో స్థానంలో రోథ్ చైల్డ్స్ కుటుంబం నిలిచింది. పద్దెనిమిదో శతాబ్దంలో రోథ్ చైల్డ్ రూ.17,50,000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడని పేర్కొంది.
ఇందులో మహిళలకు ఎవరికీ చోటు దక్కలేదు. ఆ ఇరవై నాలుగు మందిలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అత్యంత ధనికుడిగా కార్లోస్ స్లిమ్ ఉన్నారు. ఆయన ఈ జాబితాలో 23వ స్థానంలో ఉండగా.. అత్యంత ధనికుడిగా పేరుగాంచిన వారెన్ బఫెట్ 24వ స్థానంలో ఉన్నారు.