నోబెల్ కన్నా మిన్న: ఆసియా బిజినెస్మెన్స్ టాంగ్
ఈ విషయాన్ని రెంటెక్స్ గ్రూప్ అధినేత యిన్ స్వయంగా ప్రకటించారు. క్రీ.శ. 618-917 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలనలో ఉన్న టాంగ్ వంశస్థులు సాంస్కృతిక, శాస్త్రీయ రంగాల్లో చైనా అభివృద్ధి చెందడానికి ఎనలేని కృషి చేశారు. వీరి పేరుతో రూ.566 కోట్లతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, 'టాంగ్' ప్రైజ్ ఇవ్వాలని ఇన్ నిర్ణయించారు.
ప్రతి రెండేళ్లకోసారి ఇచ్చే ఈ పురస్కారాలలో జీవ ఔషధ శాస్త్రం, సుస్థిరమైన అభివృద్ధి, చైనా గురించిన పరిశోధనలు, అక్కడి చట్టాలు తదితర రంగాలలో కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు. మానవాళి అభివృద్ధిలో ఈ రంగాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యానే ఈ విభాగాల్లో పురస్కారాలు ఇవ్వాలనుకొంటున్నామని యిన్ చెబుతున్నారు.
వచ్చే ఏడాది అంటే, 2013-14 సంవత్సరం నుండి ఈ బహుమతులను ఇవ్వడం ప్రారంభిస్తారు. రూ.19వేల కోట్ల విలువ చేసే తన ఆస్తులలో తన మరణానంతరం 95 శాతం ఆస్తులను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని అరవై రెండేళ్ల యిన్ గత ఏడాది నిర్ణయించారు. ఎనభై వేల మందికి పైగా చైనా విద్యార్థులు చదువుకోవడానికి ఆయన సహాయం చేశారు. తైవాన్కు చెందిన ప్రతిష్ఠాత్మక పరిశోధనాసంస్థ అకాడెమియా సినికా నియమించే ప్రత్యేక కమిటీ టాంగ్ బహుమతి విజేతలను నిర్ణయిస్తుంది.