పెటా కోసం ‘జలకన్య’లా నటి ఆదాశర్మ(పిక్చర్స్)
హైదరాబాద్: మనుషులందరూ శాకాహారులుగా మారాలని సినీ నటి, ‘హార్ట్ ఎటాక్' ఫేం ఆదా శర్మ అన్నారు. పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్) సంస్థ ప్రారంభించిన గో వెజిటేరియన్ ప్రచారంకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆదా శర్మ శుక్రవారం ఆ సంస్థ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు.
నగరంలోని బంజారాహిల్స్లోని ఓ స్టూడియలో జరిగిన ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ‘ఈ సృష్టిలో ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది. మన ఆకలి కోసం ఇతర జీవాలను మట్టుపెట్టడం దుర్మార్గం. శాకాహారాన్ని తీసుకోండి. శాకాహారులుగా మారండి' అని ఆదా శర్మ పిలుపునిచ్చారు.
ఆదా శర్మ
మనుషులందరూ శాకాహారులుగా మారాలని సినీ నటి, ‘హార్ట్ ఎటాక్' ఫేం ఆదా శర్మ అన్నారు.
ఆదా శర్మ
పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్) సంస్థ ప్రారంభించిన గో వెజిటేరియన్ ప్రచారంకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆదా శర్మ శుక్రవారం ఆ సంస్థ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు.
ఆదా శర్మ
నగరంలోని బంజారాహిల్స్లోని ఓ స్టూడియలో జరిగిన ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు.
ఆదా శర్మ
‘ఈ సృష్టిలో ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది. మన ఆకలి కోసం ఇతర జీవాలను మట్టుపెట్టడం దుర్మార్గం. శాకాహారాన్ని తీసుకోండి. శాకాహారులుగా మారండి' అని ఆదా శర్మ పిలుపునిచ్చారు.
ఆదా శర్మ
తమది అయ్యంగారి ఫ్యామిలీ అని, తానెప్పుడూ మాంసాహారం తిన్నది లేదని ఆమె చెప్పారు.
ఆదా శర్మ
మాంసాహారం తినడం వల్ల శక్తి వస్తుంది లేదంటే ఇతర ఉపయోగాలు ఉన్నాయనుకోవడం కేవలం అపోహమాత్రమే' అని చెప్పారు.
ఆదా శర్మ
మనలాగే ఇతర జీవాలకు జీవించే హక్కు ఉందని సినీ నటి ఆదా శర్మ అన్నారు.
ఆదా శర్మ
జల జీవరాశుల రక్షణ కోసం జలకన్యగా తాను ఈ పోస్టర్ల ద్వారా ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు.
ఆదా శర్మ
ప్రస్తుతం తాను టాలీవుడ్లో రెండు, బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆదా శర్మ
తెలుగు చలన చిత్రం పరిశ్రమ తనకు నచ్చిందని చెప్పిన ఆదా శర్మ, ఇక్కడి వారి ప్రోత్సామం మరువలేనిదని చెప్పారు.
‘మాది అయ్యంగారి ఫ్యామిలీ. నేనెప్పుడూ మాంసాహారం తిన్నది లేదు. అయినా ఆరోగ్యంగానే ఉన్నాను. మాంసాహారం తినడం వల్ల శక్తి వస్తుంది లేదంటే ఇతర ఉపయోగాలు ఉన్నాయనుకోవడం కేవలం అపోహమాత్రమే' అని చెప్పారు. మనలాగే ఇతర జీవాలకు జీవించే హక్కు ఉందని అన్నారు.
జల జీవరాశుల రక్షణ కోసం జలకన్యగా తాను ఈ పోస్టర్ల ద్వారా ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను టాలీవుడ్లో రెండు, బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు చలన చిత్రం పరిశ్రమ తనకు నచ్చిందని చెప్పిన ఆదా శర్మ, ఇక్కడి వారి ప్రోత్సామం మరువలేనిదని చెప్పారు.