పెట్టుబడులే లక్ష్యంగా పార్ట్ నర్ షిప్ సమ్మిట్, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎపి సర్కార్
విశాఖలో జరిగే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కు ఎపి ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సుకు యాభై దేశాల నుండి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
విశాఖ: విశాఖ పట్టణంలో వరుసగా రెండో ఏడాది సిఐఐ సదస్సు జరగనుంది. గత ఏడాది ఈ సదస్సును ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. అదే స్పూర్తితో ఈ ఏడాది కూడ సిఐఐ సదస్సును నిర్వహిస్తోంది. ఎపి సర్కార్.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సిఐఐ సదస్సు నిర్వహణను ఎంచుకొంది ప్రభుత్వం. ఈ సదస్సుకు సుమారు 50 దేశాల నుండి రెండువేల మంది ప్రతినిధులను హజరుకానున్నారు.
రెండు రోజుల పాటు విశాఖ వేదికగా ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎపి సర్కార్ పలు రాయితీలను ప్రకటించనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను సర్కార్ పారిశ్రామికవేత్తలకు వరాల జల్లును కురిపించనుంది.
ఈ సదస్సును విజయవంతం చేసేందుకుగాను ఎపి సర్కార్ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది జనవరి 10 నుండి 12వ, తేదివరకు సిఐఐ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ విజయవంతమైనందున మరోసారి ఈ సమ్మిట్ నిర్వహణకు ఎపి సర్కార్ సిద్దమైంది.