బ్రెగ్జిట్ ఎఫెక్ట్: రూ.200వందల కోట్ల జాక్పాట్ కొట్టేశాడు
లండన్: ప్రపంచవ్యాప్తంగా బ్రెగ్జిట్ ప్రభావం పడింది. స్టార్ మార్కెట్లు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. బ్రెగ్జిట్ మాత్రం ఓ వ్యక్తికి వందల కోట్ల రూపాయలను సంపాదించి పెట్టింది. 220 మిలియన్ పౌండ్లు.. మన లెక్కల్లో దాదాపు రూ.2వందల కోట్ల మేర జాక్పాట్ కొట్టాడు.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోతుందని హెడ్జ్ ఫండ్ సంస్థ అధిపతి క్రిస్పిన్ అడే గట్టిగా నమ్మాడు. బ్రెగ్జిట్ గెలుస్తుందని, ఆపై బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు పౌండ్ విలువ భారీగా పతనమవుతుందని లండన్కు చెందిన అతను నమ్మాడు.
పలు సర్వేలు బ్రెగ్జిట్కు వ్యతిరేక ఫలితం వస్తుందని చెబుతున్నా వాటిని పక్కన పెట్టి క్రిస్పిన్ బ్రెగ్జిట్ గెలుస్తుందని పందెం కట్టాడు. అంతేకాదు, బంగారం పైన బాగా పెట్టుబడులు పెట్టాడు. రెఫరెండం తర్వాత పౌండ్ విలువ మూడు దశాబ్దాల కనిష్ఠస్థాయికి పడిపోగా, బంగారం ధర పెరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, బ్రెగ్జిట్ ఫలితాలు బ్రిటన్ పందెరాయుళ్లకు నిరాశను మిగిల్చాయి. ఈయూతో కలిసి ఉండేందుకు మొగ్గు చూపుతారని భావించి అధికశాతం అలాగే పందెం కట్టారు. దీంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. క్రిస్పిన్ మాత్రం ఒక్కరోజులో వందల కోట్లు సంపాదించాడు.