వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీ, రోహిత్ మెరుపు: దావూద్ ఇబ్రహీం లెక్కతప్పింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం క్రికెట్ మ్యాచ్‌ల పైన బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. గురువారం రాత్రి ప్రపంచ కప్ ట్వంటీ 20 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ పైనా అతడు బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, మ్యాచ్‌కు ముందు అతను రోహిత్ శర్మ బాగా ఆడతాడని జోస్యం చెప్పాడు.

సెమీ ఫైనల్లో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ చెలరేగి ఆడినా విజయం మాత్రం ధోనీ సేనదేనని దావూద్ ఇబ్రహీం చెప్పాడని గురువారం మధ్యాహ్నం నుంచి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కోహ్లీ కంటే రోహిత్ శర్మ మ్యాచ్‌లో సత్తా చాటుతాడని కూడా అంచనా వేశాడు.

Dawood Ibrahim predicts Rohit Sharma to shine ahead of Kohli in 2nd semi final

అయితే, వెస్టిండీస్‌తో మ్యాచులో గత మ్యాచుల్లో కంటే రోహిత్ శర్మ బాగానే ఆడినప్పటికీ... దావూద్ చెప్పినట్లుగా విరాట్ కోహ్లీ కంటే మెరుగైన ఆటతీరు మాత్రం కనబర్చలేదు. ధోనీ సేన గెలుస్తుందని చెప్పాడు. కానీ ఓటమి చవి చూసింది.

Dawood Ibrahim predicts Rohit Sharma to shine ahead of Kohli in 2nd semi final

అంతేకాదు, ఈ టోర్నీకే హైలైట్ అయిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పైన రూ.2,500 కోట్ల మేర బెట్టింగ్ జరిగిందని కూడా దావూద్ చెప్పాడని తెలుస్తోంది. గురువారం నాటి భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైన రూ.4,000 కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశాలున్నట్లు అతడు చెప్పాడని తెలుస్తోంది.

English summary
Undercover don Dawood Ebrahim has predicted Indian cricket team batsman Rohit Sharma to perform better than Virat Kohli in the crucial ICC World T20 semi-final match against West Indies at the Wankhede, Mumbai on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X