శోభయాత్ర: విదేశీ వనితల నృత్యాలు (పిక్చర్స్)
విశాఖపట్నం: విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఇస్కాన్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర సంకీర్తన శోభాయాత్రలో విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంప్రదాయ బద్ధమైన చీరకట్టు, బొట్టుతో, పంచెకట్టు, లాల్చీలతో మెడలో పూలమాలలతో పలువురు విదేశీ వనితలు, పురుషులు భక్తిపారశ్యంలో నృత్యాలు చేశారు.
ఈ యాత్రను జిల్లా కోర్టు వద్ద సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద అధినేత మావూరి వెంకటరమణ ప్రారంభించారు. యాత్రలో సుమారు 36 దేశాలకు చెందిన 140 మంది ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దారిపొడవునా సంకీర్తనలు పాడుతూ.. భజనలు, నృత్యాలు చేశారు. మార్గమధ్యలో ఇస్కాన్కు సంబంధించి ఆధ్యాత్మిక పుస్తకాలను విక్రయించారు.
శోభయాత్ర జగదాంబ కూడలి మీదుగా సూర్యబాగ్ వరకు సాగింది. కార్యక్రమంలో సంఘ సేవకులు మట్టపల్లి చలమయ్య, వంకాయల సన్యాసిరాజు, ఆర్ రాధాకృష్ణ, ఇస్కాన్ విశాఖ శాఖ అధ్యక్షుడు సాంబదాన్, మాతాజీ నితాయ్ సేవిని, ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శోభయాత్ర
విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఇస్కాన్ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర సంకీర్తన శోభయాత్రలో విశేషంగా ఆకట్టుకుంది.
శోభయాత్ర
ఈ సందర్భంగా సంప్రదాయ బద్ధమైన చీరకట్టు, బొట్టుతో, పంచెకట్టు, లాల్చీలతో మెడలో పూలమాలలతో పలువురు విదేశీ వనితలు, పురుషులు భక్తిపారశ్యంలో నృత్యాలు చేశారు.
శోభయాత్ర
ఈ యాత్రను జిల్లా కోర్టు వద్ద సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద అధినేత మావూరి వెంకటరమణ ప్రారంభించారు.
శోభయాత్ర
యాత్రలో సుమారు 36 దేశాలకు చెందిన 140 మంది ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
శోభయాత్ర
దారిపొడవునా సంకీర్తనలు పాడుతూ.. భజనలు, నృత్యాలు చేశారు. మార్గమధ్యలో ఇస్కాన్కు సంబంధించి ఆధ్యాత్మిక పుస్తకాలను విక్రయించారు.