ఎన్నికల ఫలితాలు: కవిత ప్రార్థనలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి లోకసభ అభ్యర్థి కవిత నగరంలోని నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కవిత ఇక్కడ ‘చాదర్' సమర్పించారు. ముస్లిం మత పెద్దలు ఆమెకు ఆశీస్సులు అందజేశారు.
శుక్రవారం (మే 16న)న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడతున్న నేపథ్యంలో కవిత దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్నికల పోటీలో ఉన్న పలువురు నాయకులు కూడా ప్రార్థనాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
సికింద్రాబాద్ టిఆర్ఎస్ లోకసభ అభ్యర్థి భీంసేన్, అంబర్పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి హనుమంతరావు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జూబ్లీహిల్స్ టిడిపి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వెంకటగిరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
యుసిఫియన్ దర్గాలో కవిత ప్రార్థనలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి లోకసభ అభ్యర్థి కవిత నగరంలోని నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాను సందర్శించారు.
యుసిఫియన్ దర్గాలో కవిత ప్రార్థనలు
శుక్రవారం (మే 16న)న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడతున్న నేపథ్యంలో కవిత దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
యుసిఫియన్ దర్గాలో కవిత ప్రార్థనలు
దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కవిత ఇక్కడ ‘చాదర్' సమర్పించారు. ముస్లిం మత పెద్దలు ఆమెకు ఆశీస్సులు అందజేశారు.
యుసిఫియన్ దర్గాలో కవిత ప్రార్థనలు
శుక్రవారం (మే 16న)న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడతున్న నేపథ్యంలో కవిత దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
యుసిఫియన్ దర్గాలో కవిత ప్రార్థనలు
ఎన్నికల పోటీలో ఉన్న పలువురు నాయకులు కూడా ప్రార్థనాలయాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు.