సచిన్, చిరు, నాగ్ లుంగీ కట్టి సవాల్ విసిరారు(పిక్చర్స్)
కొచ్చి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జున, తదితర ప్రముఖులు ఒకే వేదికపై లుంగీ కట్టుకుని సందడి చేశారు. అంతేగాక, పోరుకు సయ్యంటూ ప్రత్యర్థులకు సవాలు విసిరారు. కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ జట్టు తుది సభ్యుల పరిచయ కార్యక్రమంలో వీరంతా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సచిన్, చిరు, నాగ్
ఇండియన్ సూపర్ లీగ్ 2016(ఐఎస్ఎల్) టోర్నీ అక్టోబరు 1న ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ సీజన్లో కేరళ బ్లాస్టర్స్ కొత్త బృందాన్ని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జట్టు యజమానులైన సచిన్ టెండూల్కర్, చిరంజీవి, నాగార్జున, సినీ నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్.. జట్టు సభ్యులతో కలిసి సందడి చేశారు.
ఆటగాళ్లతో సందడి
మళయాల యువనటుడు నివిన్ పౌలిని జట్టుకు యూత్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు. తొలి రెండు సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బ్లాస్టర్స్.. ఈసారి కీలక మార్పులు చేసుకుని బరిలో దిగుతోంది. కోచ్గా స్టీఫెన్ కాంపెల్, కీలక ఆటగాడిగా ఆరోన్ హ్యూస్ను నియమించుకుంది.
వేదిక మెరిసింది
జట్టు ఆటగాళ్ల విషయానికొస్తే.. మార్క్యూ స్టార్ ఆటగాడు ఆరోన్ హుస్, డిఫెండర్ సెడ్రిక్ హెంగ్ బర్ట్, గోల్ కీపర్ గ్రాహం స్టాక్, మైఖేల్ చోప్రా, అజ్రక్ మహమత్, డ్యూకెన్స్ నజన్, కెర్వెన్స్ బెల్బోర్ట్, డిడియర్ బోరిస్ కడియో, ఎల్హడ్జి ఔస్సన్యూ ఎన్డే, సహా 27 మంది ఫుట్బాల్ క్రీడాకారులతో పటిష్టంగా ఉంది.
కేరళ బ్లాస్టర్స్
కేరళ బ్లాస్టర్స్.. నిరుడు అద్భుతంగా రాణించిన ఆంటోనియో జర్మన్, జోసూ తోపాటు భారత స్టార్ ఆటగాళ్లు సందేశ్ జింగాన్, హెహ్తాబ్ హుస్సేన్, సందీప్ నంది, మహ్మద్ రఫీ, గుర్వీందర్ సింగ్ తాజా జట్టులో చోటు కల్పించింది.