కన్నుల పండవగా సాగిన పేరిణి నృత్యం(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర శాస్త్రీయ నృత్యకళ... పేరిణి లాస్య, తాండవ నృత్య సంప్రదాయాల శిక్షణ శిబిరం కన్నుల పండువగా ముగిసింది. శనివారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో యువ, ఔత్సాహిక కళాకారులు వైవిధ్య భరితమైన నృత్యాంశాలు ఆసక్తికరంగా ప్రదర్శించారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పేరిణి కళాకారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాకతీయుల కాలంనాటి పేరిణి నృత్యానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో యువత సాంప్రదాయ నృత్యాలను మరిచిపోతున్నారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కళలను ఎదగకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. పేరిణి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి కృషిచేస్తామన్నారు.
పేరిణి నృత్యం
రాష్ట్ర శాస్త్రీయ నృత్యకళ... పేరిణి లాస్య, తాండవ నృత్య సంప్రదాయాల శిక్షణ శిబిరం కన్నుల పండువగా ముగిసింది.
పేరిణి నృత్యం
శనివారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో యువ, ఔత్సాహిక కళాకారులు వైవిధ్య భరితమైన నృత్యాంశాలు ఆసక్తికరంగా ప్రదర్శించారు.
పేరిణి నృత్యం
తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పేరిణి కళాకారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాకతీయుల కాలంనాటి పేరిణి నృత్యానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
పేరిణి నృత్యం
ప్రపంచీకరణ నేపథ్యంలో యువత సాంప్రదాయ నృత్యాలను మరిచిపోతున్నారని అన్నారు.
పేరిణి నృత్యం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కళలను ఎదగకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. పేరిణి నాట్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి కృషిచేస్తామన్నారు.
పేరిణి నృత్యం
అనంతరం శిక్షణా శిబిరాన్ని నిర్వహించిన నాట్యగురువులను సత్కరించారు. కాగా, శిబిరంలో నాట్యకళాకారులు పేరిణి తాండవం, పేరిణి లాస్యం ప్రదర్శించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
పేరిణి నృత్యం
కార్యక్రమంలో నాట్యగురువులు కళాకృష్ణ, పేరిణి ప్రకాష్, సువర్చల, టంగుటూరి భీమన్ తదితరులు పాల్గొన్నారు.