అద్భుతం: చూడండి సూర్య గ్రహణం(పిక్చర్స్)
హైదరాబాద్: సూర్య గ్రహణం కారణంగా బుధవారం సూర్యోదయాన్ని చంద్రుడు కాసేపు అడ్డుకున్నాడు. నేటి ఉదయం సంపూర్ణ సూర్యగ్రహణం ఇండోనేషియాలో ఆవిష్కృతం కాగా, భారత్లో పాక్షికంగా కనిపించింది.
ఇది ఇలా ఉండగా, కృష్ణా జిల్లా విజయవాడలో సూర్యగ్రహణం సమయంలోని అద్భుత దృశ్యాలు కనిపించాయి. సూర్యగ్రహణం చూడలేకపోయిన వారు ఈ ఫొటోల్ని చూస్తే.. గ్రహాణాన్ని మిస్సయ్యామనే ఫీలింగే ఉండదు. అద్భుతంగా ఉన్న సూర్య గ్రహణ చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
తిరుపతి సహా ఆలయాల మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను మూసివేసేందుకు నిర్ణయించారు. దాదాపు అన్ని దేవాలయాలను మంగళవారం రాత్రే మూసివేశారు. బుధవారం సూర్యగ్రహణం తర్వాత శుద్ధి చేసి, సంప్రోక్షణ చేసిన తర్వాత రోజువారీ పూజల అనంతరం భక్తుల దర్శనానికి అవకాశం ఇస్తారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం రాత్రి మూసివేశారు. బుధవారం ఉదయం 11.30 తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, అన్నవరం , వేములవాడ, శ్రీశైలం, బాసర, భద్రాచలం, యాదగిరిగుట్ట, అలంపురం, మట్టపల్లి తదితర దేవాలయాలన్నీ మంగళవారం రాత్రే మూసివేశారు. ఈ దేవాలయలన్నీ ఉదయం 11.30 గంటల నుండి 12.30 గంటల మధ్య తిరిగి తెరుస్తామని ఆయా దేవాలయాల ప్రధాన అర్చకులు ప్రకటించారు.
సూర్య గ్రహణం
సూర్య గ్రహణం కారణంగా బుధవారం సూర్యోదయాన్ని చంద్రుడు కాసేపు అడ్డుకున్నాడు.
సూర్య గ్రహణం
నేటి ఉదయం సంపూర్ణ సూర్యగ్రహణం ఇండోనేషియాలో ఆవిష్కృతం కాగా, భారత్లో పాక్షికంగా కనిపించింది.
సూర్య గ్రహణం
ఇది ఇలా ఉండగా, కృష్ణా జిల్లా విజయవాడలో సూర్యగ్రహణం సమయంలోని అద్భుత దృశ్యాలు కనిపించాయి.
సూర్య గ్రహణం
సూర్యగ్రహణం చూడలేకపోయిన వారు ఈ ఫొటోల్ని చూస్తే.. గ్రహాణాన్ని మిస్సయ్యామనే ఫీలింగే ఉండదు.
సూర్య గ్రహణం
అద్భుతంగా ఉన్న సూర్య గ్రహణ చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
సూర్య గ్రహణం
సూర్య గ్రహణాన్ని ప్రత్యేక పరికరాలతో వీక్షిస్తున్న యువతులు.
ఆలయాల మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను మూసివేసేందుకు నిర్ణయించారు.
ఆలయాల మూసివేత
దాదాపు అన్ని దేవాలయాలను మంగళవారం రాత్రే మూసివేశారు.
ఆలయాల మూసివేత
బుధవారం సూర్యగ్రహణం తర్వాత శుద్ధి చేసి, సంప్రోక్షణ చేసిన తర్వాత రోజువారీ పూజల అనంతరం భక్తుల దర్శనానికి అవకాశం ఇస్తారు.
ఆలయాల మూసివేత
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం రాత్రి మూసివేశారు. బుధవారం ఉదయం 11.30 తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.