హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల 23 నుంచి మార్చి ఒకటి వరకు జరగనుంది. శిల్పకళా వేదికలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ ట్రోఫీని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో టాలెంట్ హంట్ నిర్వహించి ప్రతిభగల ఆటగాళ్లను ఎంపిక చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అదేవిధంగా యువకులు టోర్నీ నుంచి స్ఫూర్తిని పొందాలని, ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

ఇక గ్రామీణ స్థాయిలోని ప్రతిభ గల యువకులను టోర్నీ ద్వారా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని లీగ్ ఛైర్మన్ మన్నె గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

 ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

తెలంగాణ ప్రీమియర్ లీగ్ లాంటి ఓ మెగా ఈవెంట్‌లో భాగస్వామిగా మారినందుకు సంతోషంగా ఉందని లీగ్ డైరెక్టర్ సీహెచ్ వెంకటేష్ అన్నారు.

 ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానుండడం యువకులకు క్రీడా స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 12 జట్ల ఫ్రాంఛైజీలు యజమానులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

 ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

ఎల్బీ స్టేడియంలో 23 నుంచి టీపీఎల్

ఈ సందర్భంగా నటరాజ్ డ్యాన్స్ ట్రూఫ్ ఆధ్వర్యంలో జరిగిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు ఓంకార్, నటుడు టి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Trophy Launch of Telangana Premier League at Rock Heights Shilpa Kala Vedika,Hitech City Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X