కెనడియన్ సిక్కు యువతి హత్య
సిలికాన్ వ్యాలీలో భారతీయుల ప్రాభవం దినదిన ప్రవర్ధమానమవుతున్నది. 1998నాటికిసిలికాన్ వ్యాలీలో 788 భారతీయ కంపెనీలు ఉన్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. ఈసంఖ్య ఇప్పటికి మరింత పెరిగి ఉంటుంది. 1998 అక్టోబర్ నుంచి 1999మార్చి వరకువీసాలు పొందినవారిలో 48శాతం భారతీయులే కావడంవిశేషం. వేలాది భారతీయులు సిలికాన్ వ్యాలీలో కంప్యూటర్ కంపెనీలుపెట్టుకోవడమే గాక అక్కడ భారతీయ సంస్కృతిని వ్యాపింపజేస్తున్నారు. హిందూ దేవాలయాలను, భారతీయ సంగీత, నృత్యపాఠశాలలు, సినిమా ధియేటర్లు నిర్మిస్తున్నారు.మొత్తానికి వాజ్ పేయి పర్యటన రద్దు కావడంతో సిలికాన్ వ్యాలీలోని భారతీయులునిరుత్సాహపడ్డారని అరోగ్యకారణాల వల్ల ఆయన రాలేక పోతున్నారని తెలుసుకునిసర్దిచెప్పుకున్నారని దేవాంగ్ మెహతా అన్నారు. వారిలో కొందరు వాషింగ్టన్ లోను,మరికొందరు న్యూయార్క్ లోను ప్రధానమంత్రిని కలుసుకుంటారని ఆయన తెలిపారు.భారత్-అమెరికా ప్రభుత్వాల మధ్య వాషింగ్టన్ లో జరుగనున్న చర్చలమీద తామిప్పుడు దృష్టి కేంద్రీకరించినట్టు ఆయన చెప్పారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యసంబంధాలను పెంపొందించడానికి ఐదు నాన్-టారిఫ్ కు సంబంధించినఅయిదు సూచనలను నాస్ కాం చేసినట్టు ఆయన తెలిపారు.