ఎన్ఆర్ఐలకుపార్లమెంట్లో అవకాశం
దుబాయి:పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవాసభారతీయులకు స్థానం కల్పించాలని ప్రవాసభారతీయులకు ప్రాతినిధ్యం వహించేఒవర్సీస్ ఇండియన్స్ ఎకనామిక్ ఫోరంఅధ్యక్షుడు రామ్ బుక్సాని కోరారు.ప్రపంచవ్యాప్తంగా ప్రవాసుల సంఖ్య సుమారు 2కోట్ల 50 లక్షల మేర వుంటుందని ఏటా బడ్జెట్సమయంలో కంటితుడుపుగా తోచినరాయితీలు ఇవ్వడం మినహా ప్రభుత్వం ఎన్ఆర్ఐలసమస్యల గురించి పెద్దగా పట్టించుకున్నదిలేదని ఆయన అంటున్నారు. తమసమస్యలను ప్రభుత్వం దృష్టికితీసుకురావడానికి తమకున్న ఏకైక మార్గంకేవలం మీడియా మాత్రమేనని ఆయనచెప్పారు. కళాసాంస్కృతిక రంగాల్లో, క్రీడల్లోపేరుప్రఖ్యాతులు సంపాదించినవారినిరాజ్యసభకు నామినేట్ చేయడంఆనవాయితీగా వస్తున్నదని, అదే విధంగా ఎన్ఆర్ఐలకుకూడా ఈ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రవాసుల తాముస్థిరపడిన దేశాల్లో ఎంతో పలుకుబడిసంపాదించుకుంటున్నప్పటికీ, మాతృదేశంలోమాత్రం అనామకులుగా మిగిలిపోవల్సి వస్తున్నదనిఆయన చెప్పారు.