వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొయిలీ మాట చేటే!

By Staff
|
Google Oneindia TeluguNews


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ వీరప్పమొయిలీ తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లారు. పాత ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ దారినే ఆయన స్పష్టంగా ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖ రెడ్డికి పూర్తి అండదండలు అందించడమే కాదు, అసమ్మతిని ఏ మాత్రం సహించబోమనే విషయాన్ని ఆయన కచ్చితంగా తేల్చేసినట్లే. దిగ్విజయ్ సింగ్ పోయి వీరప్పమొయిలీ రావడం వల్ల తెలంగాణ అంశం తమకు అనుకూలంగా కదులుతుందేమోనని గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆశపడుతూ వచ్చారు. కానీ వారి పప్పులేం ఉడకవని ఆయన నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తాము రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉన్నామని చెప్పడమే కాకుండా తమ నాయకురాలు సోనియా అభిమతం కూడా అదేనని ఆయన స్పష్టం చేశారు. ఇంతవరకు సోనియా గాంధీ తెలంగాణ విషయంలో భిన్నంగా ఉన్నారేమోననే ఊహలకు కూడా ఆయన తెర వేశారు. ఇక తెలంగాణ విషయంలో స్పష్టంగా కాంగ్రెస్ తేల్చేసినట్లే అయింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేష్టలుడిగిన పరిస్థితిలోనే పడిపోవాల్సి వచ్చింది.


ప్రత్యేక పిసిసి కావాలని కూడా ఈ మధ్య కాలంలో కొందరు తెలంగాణ నాయకులు డిమాండు చేస్తూ వస్తున్నారు. దాన్ని కూడా ఆయన కొట్టి పారేశారు. తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిఆర్సీసిసి) ఉంది కదా, దాన్నే బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడని విషయమే. తెలంగాణకు ప్రత్యేక పిసిసి ఏర్పాటు చేసే కన్నా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేయాలని అంటున్న పార్లమెంటు సభ్యుడు, ఎఐసిసి కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి వంటి వారి భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి పుట్టగతులుండవని సీనియర్ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి వంటివారు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తాము ఓడిపోవడం ఖాయమనే భయం చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. వాతావరణాన్ని పసిగట్టిన వారు పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని సోనియా వద్దకు తీసికెళ్లడానికి కె. కేశవరావు సిద్ధపడిన సమయంలో ఆయన పిసిసి అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు దిక్కు లేకుండా పోయింది.


వీరప్పమొయిలీ ప్రకటన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ఆయుధం అందించినట్లే. ఇప్పటి నుంచే చాలా స్పష్టంగా ఎన్నికల వ్యూహాన్ని రచించుకునేందుకు తెరాసకు వీలు కల్పించింది. తెలంగాణ ఆకాంక్షను వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి ప్రజాకర్షక పథకాల ద్వారా కాంగ్రెస్ ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఆకాంక్షకు ప్రజాకర్షక పథకాలు ప్రత్యామ్నాయం అవుతాయా అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించాల్చే ఉంటుంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో విజయం తమదేననే విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ ఉంది. వామపక్షాలు, లోక్ సత్తా వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటుతో విజయం సాధించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ మేరకు వ్యూహాలు ఖరారవుతున్నాయి కూడా. కాంగ్రెస్ కు గడ్డు కాలం తప్పదనే విషయాన్ని పరిణామాలు తెలియజేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X