వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతీయ తేడాలు

By Staff
|
Google Oneindia TeluguNews


కాంగ్రెసులో ప్రాంతీయ విభేదాల రగడ సాగుతూనే ఉంది. తెలంగాణపై మాట్లాడకూడదని, మాట్లాడితే ఎంతటివారైనా సహించబోమని పార్టీ అధిష్ఠానవర్గం చేసిన హెచ్చరికలకు విలువ లేకుండా పోయింది. ఈ ప్రాంతీయ విభేదాలు హద్దులు దాటుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ నాయకులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తెలంగాణ ఆకాంక్ష నాయకుల్లోనే ఉంది గానీ ప్రజల్లో లేదని రాజగోపాల్ చేసిన ప్రకటనతో వివాదం అంటుకుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు.

అనవసరంగా నోరు పారేసుకోవద్దని, ఇక్కడి నుంచి పోటీ చేస్తే రాజగోపాల్ కు తెలంగాణ సెంటిమెంటు తీవ్రత తెలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ వంటి తెలంగాణ నాయకులు రాజగోపాల్ పై నిప్పులు చెరిగారు. తాను తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానని రాజగోపాల్ చేసిన ప్రకటన తెలంగాణ నాయకులను మరింత రెచ్చగొట్టింది. తెలంగాణలో పోటీ చేస్తే లగడపాటికి ప్రజల నుంచి చెప్పు దెబ్బలు తప్పవని సర్వే సత్యనారాయణ అన్నారు. మధుయాష్కీ కూడా లగడపాటి సవాల్ ను స్వీకరించారు. అయితే తెలంగాణలోని నియోజకవర్గం నుంచి పోటీకి పార్టీ అధిష్ఠానవర్గాన్ని ఒప్పించాల్సిన బాధ్యత సవాల్ చేసినవాళ్లదేనని మెలిక పెట్టారు.

Prev | Next

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X