విజయశాంతి రథయాత్ర
తల్లి తెలంగాణ ఉద్యమ నేత, ప్రముఖ సినీనటి విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రథయాత్ర చేయనున్నారు. అందుకు ఆమె ఇప్పటికే రెండు రథాలను సిద్ధం చేసుకున్నారు. ఆమె నటించిన నాయుడమ్మ సినిమా ఆగస్టు మొదటి వారంలో విడుదల కానుంది. ఆ సినిమా విడుదల, ఆమె రథయాత్ర ఒకేసారి ఉండే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత త్వరలో తాను తెలంగాణలోని 450 మండలాల్లో రథయాత్ర చేస్తానని విజయశాంతి అంటున్నారు. ఆమె ఆదివారంనాడు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళికి బోనం సమర్పించారు. ఈ సమయంలో ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్లపై నిశితమైన వ్యాఖ్యలు చేశారు. తెరాస తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, తెరాస అగ్రనేతలు కె. చంద్రశేఖరరావు, నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆమె అన్నారు. ఈ మాటలన్నప్పుడు నరేంద్ర ఆమె పక్కనే వున్నారు. అంతేకాదు, అనంతరం ఆమె నరేంద్ర కారులోనే వెళ్లిపోయారు.