వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి మూడో కొడుకు లడాయి

By Staff
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
కాంగ్రెస్ సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు, విజయవాడ లోకసభ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మూడో కుమారుడి వివాదంలో ఇరుక్కున్నారు. 2004లో తనకు ఇద్దరు కుమారులు మాత్రమేనని ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తెలియజేశారు. అయితే 2009లో సమర్పించిన అఫడవిట్ లో మాత్రం తనకు ముగ్గురు కూమారులని చెప్పారు. మూడో కుమారుడి పేరు ఎల్.హనుమాన్ అని పేర్కొన్నారు. అయితే ఈ వివాదం మైలవరం కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థి సుంకర కృష్ణమూర్తికి చుట్టుకుంది. లగడపాటి కుమారుల వ్యవహారాన్ని బయట పెట్టినందుకు తనను చంపుతామని లగడపాటి మనుషులు బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి భార్య పద్మకు ఇద్దరు కూమారులే ఉన్నారని, మూడో కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడో లగడపాటి చెప్పాలని ఆయన అన్నారు.

లగడపాటి రాజగోపాల్ మాజీ కేంద్ర మంత్రి, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర కూతురు పద్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూమారులు. తన కూతురికి ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారని, మూడో కుమారుడి గురించి లగడపాటి చెప్పాలని ఉపేంద్ర అన్నారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు లగడపాటి రాజగోపాల్ ముందు ప్రస్తావించారు. దానికి లగడపాటి ఏ మాత్రం తొనకకుండా ఆ విషయం ఉపేంద్రనే అడగండని ఆయన చెప్పారు. తాను చెప్పాల్సింది అఫిడవిట్ లో చెప్పానని ఆయన అన్నారు.

ఉపేంద్రకు, లగడపాటి మధ్య చాలా కాలంగా పడడం లేదు. ఇద్దరి మధ్య వైరం గురించి అందరికీ తెలుసు. అయితే ఈ వైరం దేని కోసమనేది మాత్రం తెలియదు. విజయవాడ పార్లమెంటు సీటు నుంచి గతంలో ఉపేంద్ర పోటీ చేశారు. అయితే లగడపాటి రాజగోపాల్ కు గతంలో కాంగ్రెసు విజయవాడ లోకసభ సీటు ఇచ్చింది. ఏమైనా లగడపాటికి వివాదాలంటే చాలా ఇష్టం. తాజాగా తనంత తానే కొత్త వివాదానికి తెర తీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X