వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బై చిరంజీవ' అంటున్న రెబల్స్!

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కొన్ని నెలల క్రితమే ఆవిర్భవించినా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టిస్తోంది. ఆ పార్టీ టికెట్లకు మంచి డిమాండ్ ఉండడం, కొత్తగా కార్యకర్తల బలం ఏర్పడడం అనుకూలాంశాలు. అయితే వందేళ్ళ కాంగ్రెస్ పార్టీలో లాగా అసంతృప్తులు, వెన్నుపోట్లు వందరోజుల్లోనే ఉద్ధృతం కావడం ప్రతికూలాంశాలు. ఆ పార్టీకి మొదటి నుంచి మూల స్ధంభాలుగా ఉన్నవారు చాలా మంది ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. ప్రముఖ సెక్స్ డాక్టర్ సమరం మొదట్లో ప్రజారాజ్యం పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. ఆయన టికెట్ ఆశించలేదు. అయినా వివిధ సామాజిక వర్గాలను ప్రజారాజ్యంలో చేర్పించడానికి ఆయన వేసిన పునాదులు మరువలేనివి.

ఏమీ ఆశించకుండా అయన ఇంత చేసినా ఇప్పుడు ఆయన మాటకు పార్టీలో వీసమెత్తు విలువలేదు. పార్టీలో చిరంజీవి డమ్మీ అయిపోతున్నారని, లోఫర్లకు, డాఫర్లకు టికెట్లు ఇస్తున్నారని సమరం విమర్శిస్తున్నారు. తన వాగ్దాటితో ప్రజారాజ్యం బహిరంగ సభల్లో మహిళలను విశేషంగా ఆకట్టుకున్న పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడా ఆనందంగా లేదు. మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి కూడా టికెట్ల పంపిణీ వ్యవహారం హేతుబద్ధంగా లేదని విమర్శించారు. సీనియర్ నాయకుడు, మాజీ ఐఎఎస్ అధికారి కెఎస్ ఆర్ మూర్తి తనకు అమలాపురం లోక్ సభ సీటు రానందుకు అలిగికూర్చున్నారు. చిరంజీవిపై ఆశలు పెట్టుకుని ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఆ పార్టీ వ్యవహారంపై ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. రాజమండ్రి టికెట్ ఇవ్వనందుకు ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్ కుమార్ కూడా తిరుగుబాటు బావుటా లేపారు. ఆయన అనుచరులు నేడు రాజమండ్రి ప్రజారాజ్యం పార్టీ ఆఫీసుకు తాళాలు వేయడం ప్రరాపా తిరిగిబాట్లకు పరాకాష్ట.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X