వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుతో దోస్తీకి కనిమొళి పొగ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కాంగ్రెసుకు, తమిళనాడులోని డిఎంకెకు మధ్య స్నేహానికి బీటలు పెడుతోంది. ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో టెలికం శాఖ మంత్రిగా ఎ రాజా రాజీనామా చేయాల్సిన పరిస్థితిపై కూడా డిఎంకె చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గుర్రుమంటూనే ఉన్నారు. తాజా పరిణామం ఇరు పార్టీల మధ్య మరింత దూరాన్ని పెంచినట్లు చెబుతున్నారు. కరుణానిధి కూతురు, పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి చెందిన స్వచ్ఛంద సంస్థ కార్యాలయంపై సిబిఐ దాడులతో ఆ దూరం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవాలని డిఎంకె భావిస్తున్నట్లు సమాచారం.

కనిమొళికి చెందిన ప్రభుత్వేతర సంస్థ తమిళ మయ్యం కార్యాలయంపై సిబిఐ అధికారులు బుధవారం దాడులు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి చెందిన డబ్బులు ఈ ఎన్జీవో ద్వారా విదేశాలకు వెళ్లి మరో రూపంలో దేశంలోకి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ కనిమొళికి చెందిన కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై డిఎంకె వర్గాలు కాంగ్రెసుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

డిఎంకెతో సంబంధాలు చెడిపోకుండా కాంగ్రెసు నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. డిఎంకె యుపిఎ నుంచి తప్పుకుంటుందనే వార్తలను కాంగ్రెసు కొట్టేస్తోది. డిఎంకె, కాంగ్రెసు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని, 2జి స్పెక్ట్రమ్ విచారణ పూర్తయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అన్నారు. 2011లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెసుతో దోస్తీని సమీక్షించేందుకు డిఎంకె అత్యవసర సమావేశం జరిగే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X