వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోట్లలో నిత్యానంద ఆస్తులు?
ఆధ్యాత్మికతకు దూరంగా కొంత కాలం తాను ఉండదలుచుకున్నట్లు కూడా నిత్యానంద చెప్పాడు. దీనికి తన ఆచార్యులు, ఆధ్యాత్మిక సలహాదారులు అంగీకరించినట్లు అతను చెప్పాడు. ధ్యానపీఠం అధిపతిగా రాజీనామా చేయడం వల్ల నిత్యానంద స్వామికి కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు. ధ్యానపీఠం అస్తులన్నీ నిత్యానంద పేరు మీదనే ఉన్నాయట. అతను కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు చెబుతున్నారు. వాటి విలువను ప్రకటించేందుకు నిత్యానంద సిద్ధంగా లేడు.
ప్రాసిక్యూటర్స్ మరింత గడువు కోరడంతో నిత్యానందపై కేసుల విచారణను కోర్టు ఏప్రిల్ ఆరో తేదీకి వాయిదా వేసింది. నిత్యానందపై ఫిర్యాదు లేదని, బాధిత పార్టీ ఏదీ లేదని అతని తరఫు న్యాయవాది అంటున్నారు. మొత్తం మీద, నిత్యానంద సురక్షితంగా లైంగిక ఆరోపణల నుంచి తప్పించుకుని కోట్లాది రూపాయల ఆస్తులను సొంతం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Story first published: Thursday, April 1, 2010, 9:37 [IST]