కృష్ణా రాజకీయం: ఫిక్స్లో దేవినేని నెహ్రూ
దేవినేని నెహ్రూకు నచ్చజెప్పడానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులు విస్తృతంగానే ప్రయత్నాలు చేశారు. తనకు సమీప బంధువైన దేవినేని ఉమా మహేశ్వర రావు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో డిసిసి పదవి చేపడితే ఆయనను ఎదుర్కోవాల్సి వస్తుందని నెహ్రూ వెనకాడినట్లు చెబుతున్నారు. దాంతో పాటు డిసిసి అధ్యక్ష పదవి తనకు తగింది కాదనే భావన కూడా ఆయనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వేదవ్యాస్ పేరు డిసిసి అధ్యక్ష పదవికి ముందుకు వచ్చిందని సమాచారం. వేదవ్యాస్ ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
వేదవ్యాస్ డిసిసి అధ్యక్ష పదవి చేపడితే గత ప్రజారాజ్యం పార్టీ నాయకులకు కృష్ణా జిల్లాలో ప్రాధాన్యం పెరుగుతుందనే భావనకు ఇప్పుడు దేవినేని నెహ్రూ ఆలోచన పడ్డారని అంటున్నారు. పైగా, తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో దేవినేని నెహ్రూ ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద, కృష్ణా కాంగ్రెసు రాజకీయాలు వేడిగానే సాగుతున్నాయి.