జగన్ను టార్గెట్ చేసిన లోకేష్ చానెల్
జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టుగా కాంగ్రెసు ప్రభుత్వానికి కూడా తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుందని ఆరోపించింది. జగన్ అక్రమాల్లో కాంగ్రెసు పెద్ద నేతలకు కూడా సంబంధం ఉండటం వల్లనే పార్టీ అధిష్టానం నోరు విప్పడం లేదన్నారు. కాంగ్రెసు నేతలు కూడా జగన్ అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని వేలకోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారని చెప్పారు. వైయస్ హయాంలో హస్తినకు మూటలు చేరాయని చెప్పారు. అప్పుడు మూటలు అందటం వల్లనే ఇప్పుడు కాంగ్రెసు పార్టీ జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత వ్యతిరేకించినా స్పందించడం లేదని చెప్పారు. ప్రధాన వాటాదారుగా ఉన్న కాంగ్రెసు చర్యలు ఇకముందు కూడా తీసుకునేందుకు ముందుకు రాదని తెలిపింది.
గతంలో జగన్ ఎంత పన్ను కట్టారు. ఇప్పుడు ఎంత పన్ను కట్టారు. ఇటీవలె జగన్ 84 కోట్ల రూపాయల ముందస్తు పన్ను కట్టారు. అయినా ఐటి శాఖ స్పందించకపోవడాన్ని వారు తప్పుపట్టారు. కొందరిపై ఐటి దాడులు చేయడం, మరికొందరిపై దాడులు చేయకపోవడాన్ని చూస్తుంటే అవినీతి నాలుగు పాదాలపై నడుస్తుందనే విషయం ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. కాంగ్రెసు, జగన్ వ్యవహారాలు చూస్తుంటే దొంగాట అడుతున్నట్టుగా ఉందన్నారు. ఆ దొంగాటలో పావులు మాత్రం ప్రజలే కావడం శోచనీయమన్నారు. అయితే అవినితి సొమ్ముతో పత్రికలు, టీవీలు పెట్టి, ఓబుళాపురం గనులు నిర్వహిస్తూ కాంగ్రెసుతో జగన్ దొంగాట ఆడుతున్నంత కాలం వారు దొరలే అవుతారని చెప్పారు.