మంత్రులు వస్తారా? ముఖం చాటేస్తారా?
మంత్రులు వందల కొద్ది ఫైళ్లను క్లియర్ చేయాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగులు కూడా మంత్రులను ఇక నుండి అడ్డుకోమని చెప్పారు. దీంతో వారు సచివాలయం వచ్చి ఫైళ్లు క్లియర్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. దాదాపు రెండు నెలల నుండి ఆయా శాఖలలో ఫైళ్లు మూలన పడి ఉన్నాయి. దీపావళి హడావుడి ముగియడంతో మంత్రులు సచివాలయానికి వచ్చి ఫైళ్లు క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల మంత్రులకు సూచనలు చేశారు.
అయితే ఉద్యమ తీవ్రతను గమనించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిగిన కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వారు అధిష్టానానికి పెట్టిన డెడ్ లైన్ మరీ దూరంగా లేక పోవడంతో స్టీరింగ్ కమిటీ ప్రకటన స్వాగతించి మంత్రులు రాజీనామాలు చేసి వస్తారా? లేక మంత్రులుగానే కొనసాగుతారా? అలా కాకుండా డెడ్ లైన్ వరకు పని చేస్తారా? అనే విషయం ముందు ముందు తేలనుంది.