వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కూతురు కవితకు లైన్ క్లియర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కవిత నిజామాబాద్ పార్లమెంటు లేదా జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆఖరుకు నిజామాబాద్ నుండే బరిలోకి దిగాలనే ఓ నిర్ణయానికి వచ్చారట.

శనివారం జరిగిన తెరాస ఆవిర్భావ సభ వేదికపై పార్టీ కల్వకుంట్లర కవిత కూర్చోవడం చర్చనీయాంశమైంది. గతంలో తెరాస వేదికలపై ఎప్పుడూ కవిత కనిపించలేదు. ఆవిర్భావ సభ వేదికపై కూర్చోవడం ఆమె నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఎంపి అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న కవిత, జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఆమె పోటీ చేసే విషయాన్ని తెరాస నేతలు బహిరంగంగా ప్రకటించకపోయినా వేదికపై ఆమె కూర్చోవడంతో పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఆవిర్భావ సభలో ఎంపి అభ్యర్ధిగా కవిత పేరు ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. కవిత మెట్టినిల్లు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్ కావడంతో ఆమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ నుండి కాంగ్రెసు పార్టీ ఎంపీ మధుయాష్కీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మరోవైపు పార్టీ ఆవిర్భావ సభ అనంతరం కెసిఆర్ తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. కెసిఆర్ ఫాం హౌస్‌లో ఉండటం నిత్యం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆయన తెరాస ప్రతినిధుల సమావేశం, 13వ వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం ఫాం హౌస్‌కు వెళ్లిపోయారు.

English summary

 It is said that TRS chief K Chandrasekhar Rao's daughter and Telangana Jagrithi president Kalvakuntla Kavitha may contest from Nizamabad in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X