ఇక్కడ బాబు, అక్కడ కెసిఆర్ తనయ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో క్రిస్మస్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రాజధానిలో పెద్ద యెత్తునే క్రైస్తవులున్నారు. దీంతో క్రిస్మస్ వేడుకలు హైదరాబాదులో భారీగా జరుగుతాయి. ఈ వేడుకలకు రాజకీయ నాయకులు కూడా దూరంగా ఉండలేని స్థితి ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారంనాడు పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులను ఎస్పీ జాబితాలో చేరుస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తాను అధికారంలోకి రాగానే పేద క్రైస్తవులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు.క్రిస్మస్ వేడుకలు సేవాభావాన్ని పెంచుతాయని ఆయన అన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో బాబు 1
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు.
క్రిస్మస్ వేడుకల్లో బాబు 2
తమ పార్టీ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దళిత క్రైస్తవులకు పలు హామీలు ఇచ్చారు.
టిడిపి ఆఫీసులో వేడుకలు..
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఇలా.. సంప్రదాయబద్దంగా వేడుకలు జరిగాయి.
క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ..
తమ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా సోమవారం సాయంత్రం చంద్రబాబు కేక్ను కట్ చేస్తూ ఇలా కనిపించారు.
కేక్ కట్ చేసిన కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ప్రసంగిస్తున్న కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ప్రసంగం కూడా చేశారు.