వేచి చూస్తున్న విజయశాంతి మునిసిపల్ లోగుట్టు వేచిచూస్తున్నవిజయశాంతిమునిసిపల్ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణఉద్యమకారిణి
జూబిలీహిల్స్లోవ్యూటవర్ నిర్మించడానికి రాష్ట్రపర్యాటకాభివృద్ధి సంస్ధ సిద్ధమవుతోంది. ఈ వంద మీటర్లవ్యూటవర్ దేశంలో మొదటిది.ఇందుకోసం ఐదు ఎకరాల స్ధలాన్ని సమకూర్చుకున్నారు. పై అంతస్ధులోరివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. మొదటిఅంతస్తులో షాపింగ్ మాల్ కడతారు.బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికమీద ప్రైవేటు పెట్టుబడిదారులకు ఈ ప్రాజెక్టును అప్పగించాలన్న ప్రతిపాదనఉంది. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టిఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతదితర సంస్ధల నుంచి అనుమతిపొందవలసి ఉంది. వ్యూటవర్ నుంచి బైనాక్యులర్స్తోచార్మినార్, గోల్కొండ కోటలను చక్కగా చూడవచ్చు.
ఆషాఢమాసంకావడంతో తెలుగు సినిమా పరిశ్రమస్తబ్దంగా ఉంది. కొత్త సినిమా ప్రారంభోత్సవాలుబాగా తగ్గాయి. సినిమాల విడుదలను కూడాఆగస్టుకు వాయిదా వేసుకుంటున్నారు. ఆగస్టుఆరు నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది.మూఢనమ్మకాలు మనకు ఎక్కువే కానీసినిమా వాళ్ళకు ఇంకా ఎక్కువ. గతంలోఆషాఢమాసంలో విడుదలైన భారీ సినిమాలుతుస్సుమనడంతో ఆషాఢమంటేనే సినీవాలాలు భయపడుతున్నారు.అయితే మంచి ముహుర్తంలో విడుదలైనసినిమాలు ఎందుకు ఆడడం లేదంటే జవాబుదొరకదు. రామానాయుడు తనకొత్త సినిమా రీలును తిరుపతి పంపించినతర్వాత కానీ సినిమా విడుదల చేయరు.ఆషాఢమాసంలో బాగా జరుగుతున్నది బట్టలవ్యాపారమే. ఆషాఢంతగ్గింపు ధరలంటూ చందన బ్రదర్స్తదితర దుకాణాలు కస్టమర్లనుఆకర్షిస్తున్నాయి.
ఎందరోప్రముఖులను తన విజయవిహారంపత్రికలో ఉతికి ఆరేసిన రమణమూర్తిఒక హత్య కేసులో దొరికిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సమాజంలోమంచి మార్పు తెచ్చేఉద్దేశంతో ఆయన జైభారత్ అనేస్వచ్ఛంద సంస్ధను ప్రారంభించిఅనతికాలంలోనే ఆ సంస్ధనుగ్రామగ్రామానికీ విస్తరించారు.విజయవిహారం పత్రికలో వార్త గిరీష్సంఘీ మీద వంద ఆరోపణలు చేశారు.ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ ఐవెంకటరావు చంద్రబాబు నాయుడుకుఏవిధంగా భజన చేసి పబ్బంగడుపుకున్నారో రాసి పత్రికా లోకంలోసంచలనం కలిగించారు. మరి ఇందరితప్పులను వెదికి తీసిన వ్యక్తిహంతకుడుగా మారడమేమిటి?విజయవిహారం జోలికి వచ్చిన వారినివదలబోమని రమణమూర్తి కోర్టుకువెళ్తూ హెచ్చరిక జారీ చేశాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు...దూరేవి.... అంటే ఇదేనేమో.