'మొద్దుశీను- పోలీసులు' అనే హారర్ హాస్ లోగుట్టు 'మొద్దుశీను-పోలీసులు' అనే హారర్ హాస్యచిత్రంమొద్దుశీను
సినీనటి,తెలంగాణ కో-అర్డినేషన్ కమిటీ కన్వీనర్ విజయశాంతి ఒకదిశా, దారీ లేకుండా తెలంగాణ ఉద్యమంనడిపిస్తున్నారు. నిన్న ఆమె నగరంలోని కాచిగూడ మురికివాడల్లోపర్యటించి సామాన్యుల సమస్యలుతెలుసుకున్నారు. గత ఎన్నికల్లో ఆమెబిజెపి తరఫున ఈ ప్రాంతాల్లో ప్రచారం చేశారు.సామాన్య ప్రజల కష్టాలు తీరాలంటేతెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరాలని ఆమెనిన్న బహిరంగ సభల్లో ఉద్ఘాటించారు.సినిమా నటి కాబట్టి ఆమెను చూడడానికిజనం వస్తున్నారు కానీ ఆమె ఉపన్యాసాల్లోబలం ఉండడం లేదని పరిశీలకులుఅంటున్నారు. మాజీ మంత్రి పుష్పలీల వంటిపనికిమాలిన నేతలు ఆమె చుట్టూ చేరుతున్నారే గానీ జనబలం ఉన్ననేతలు కరువయ్యారు. తనఉద్యమాన్ని పార్టీగా మార్చుకోవాలా వద్దాఅన్న విషయంలో ఆమెకు స్పష్టత లేదు.అయితే వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో మాత్రంఆమె అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. దీనితో తెలంగాణలోమునిసిపల్ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతబహుముఖ పోటీలు జరుగనున్నాయి.తెలుగుదేశం, బిజెపి విడివిడిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్-టిఆర్ఎస్లపరిస్ధితి కూడా దాదాపు అంతే.
నగరంలోనక్సల్-పోలీసు దోబూచులాట
ఎన్కౌంటర్కుగురైన జనశక్తి అగ్రనేత రియాజ్లాగానే అనేక మంది నక్సలైట్ నాయకులునగరానికి వచ్చిపోతున్నారనితెలుసుకున్న పోలీసులు కొన్ని ప్రాంతాల మీదప్రత్యేక నిఘా పెట్టారు. పెద్ద నక్సలైట్నాయకుడిని చంపినతర్వాత నక్సలైట్లు పెద్దటార్గెట్కు గురిపెట్టడం పరిపాటి. ఒకఎమ్మెల్యేనో, మంత్రినో, పెద్ద పోలీసుఅధికారినో చంపడానికి వారుప్రయత్నిస్తారు. అందువల్ల నగరంలోఅప్రకటిత రెడ్ అలర్ట్ అమలులో ఉంది. విఐపిజోన్లలో కాకుండా జన సమ్మర్దంఎక్కువగా ఉండే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కాలనీల్లోనక్సలైట్లు షెల్టర్ తీసుకుంటూ ఉంటారు.కొన్నేళ్ళ క్రితం ఐపిఎస్ అధికారి ఉమేష్ చంద్రనుచంపిన నక్సలైట్లుకుకట్పల్లిలో షెల్టర్ తీసుకున్నట్టువెల్లడైంది. ఇప్పుడు నక్సలైట్లకు అనుకూలంగా టిఆర్ఎస్ ప్రకటనలుచేయడంతో, నక్సలైట్ల నైతికస్ధైర్యం పెరిగింది. రెట్టించిన ఉత్సాహంతోకాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొనాలని వారుప్రయత్నిస్తున్నారు.
జానాబెత్తెడుబాధ!
ముద్దముద్దగా మొద్దబ్బాయిలా మాట్లాడేహోంమంత్రి జానారెడ్డికి ఇప్పుడు మాటలుకరువయ్యాయి. జనశక్తి అగ్రనేతరియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపడంపై ఆయనబాధపడుతున్నట్టు ఫీలర్లు వదిలారు.తెలంగాణ వాది అయిన జానారెడ్డి నక్సలైట్లు హింసాకాండకుపాల్పడనంతవరకు వారి మీదసాఫ్ట్కార్నర్ ప్రదర్శిస్తూ ఉంటారు. రియాజ్ ఎన్కౌంటర్పై జానా మనస్ధాపంచెందారని, పోలీసు అధికారులు అదుపుతప్పి వ్యవహరిస్తున్నారనిబాధపడ్డారని పత్రికల్లో వచ్చిన వార్తలనుముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వయంగా ఖండించవలసి వచ్చింది.ముఖ్యమంత్రి వారం రోజుల పాటు విదేశీపర్యటనకు వె ళ్తున్నందువల్లశాంతిభద్రతల భారాన్ని మొత్తంజానారెడ్డి మోయవలసి ఉంటుంది.