'తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ సచ్చుడో' టి లోగుట్టు 'తెలంగాణవచ్చుడో, కెసిఆర్ సచ్చుడో'టిఆర్ఎస్నేతలు, కేంద్ర
సినీనటిశిష్వ మోహన్ అనే వ్యక్తి తనకువేషాలు ఇప్పిస్తానని చెప్పి తననుఅన్నివిధాలుగా వాడుకుని మోసగించాడంటూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఎవరీ మోహన్? పశ్చిమ మండలం డిప్యూటీపోలీసు కమిషనర్గా పనిచేసిన సంజయ్మిత్రుడు. ఆ జోన్లో సూడో డిసిపిగా చలామణిఅయ్యాడు. ఎన్నారైననిచెప్పుకునేవాడు. అతను శిష్వను ఎరగావేసి పెద్ద వ్యాపారుల నుంచి డబ్బులాగేవాడని తెలుస్తోంది. మోహన్నిర్వాకాల కారణంగా సంజయ్కిచెడ్డపేరు వచ్చింది. ఫలితంగా ఈ యువఐపిఎస్ అధికారి అప్రధానమైన ఆర్టీసీకి బదిలీఅయ్యారు. శిష్వది విజయవాడ. చిరంజీవిఅన్నయ్యలో సౌందర్య చెల్లెలుగా నటించింది.మరికొన్ని సినిమాల్లో సైడ్హీరోయిన్. శిష్వ వద్ద చాలా మందిపెద్ద మనుషులు గుట్లు ఉన్నట్టు పోలీసులుఅనుమానిస్తున్నారు.
చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికలనుప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కన్పిస్తోంది.నక్సలైట్ల టార్గెట్లో ఉన్నఆయన ధైర్యం చేసి తెలంగాణలోరోడ్షోలు నిర్వహిస్తున్నారు. ఆయన చుట్టూకమెండోలు కంటికి రెప్పలా కాపలాఉంటున్నారు. మునిసిపల్ ఎన్నికల్లోకాంగ్రెస్తో సమానంగాతెలుగుదేశానికి ఓట్లు వస్తే కేడర్నుఉత్సాహపరచడం సులభమవుతుందని ఆయనఆలోచన.2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీవిజయం సాధిస్తుందన్న ధైర్యాన్నిఆయన పార్టీ శ్రేణులకు కలిగించాల్సినఅవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదలప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వడం, వైఎస్ తరచుగాప్రజల్లోకి వెళ్ళడం తదితర కారణాలవల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఇప్పటికీసానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం ఉంది.తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకిరావాలంటే ఏదో అద్భుతంజరగాలి.వరంగల్ రోడ్షోల్లో చంద్రబాబునాయుడికి ప్రజల ఆదరణలభించింది.
పొలిటీషియన్లనీడలో తెలుగు పత్రికలు
మజ్లిస్నాయకుడు సలావుద్దీన్ ఒవైసీ ఒక ఉర్దూదినపత్రికను ప్రారంభించనున్నారు.రాజకీయ నాయకులు పత్రికలు పెట్టకూడదని ఎక్కడాలేదు. అయితేరాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నపత్రికలు పాఠకులకు నిస్పక్షపాతంగావార్తలను అందించలేవు. గత ఎన్నికల్లోకాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన ఒకతెలుగు దినపత్రిక సర్క్యులేషన్ రోజురోజుకీ పడిపోతోంది. రాజ్యసభసభ్యుడైన ఆ పత్రిక యజమాని పత్రికపెట్టిన పర్పస్ నెరవేరిందనిఆనందిస్తున్నారు. చంద్రబాబు నాయుడుఅండదండలతో ప్రారంభమైన ఒకపత్రిక ఇప్పటికీ తీవ్రమైన నష్టాల్లోకొట్టుమిట్టాడుతోంది. దాసరి నారాయణరావుతన ఉదయం పత్రికను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు.క్షీణించిపోయిన మరో తెలుగు పత్రికఆంధ్రప్రభను ముత్తా గోపాలకృష్ణఅనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్కరపత్రంగా మార్చినడుపుతున్నారు. ఇదీ తెలుగు పత్రికలస్ధితి.