హోంపేజి
చంద్రబాబు నాయుడు ఏదైనా శాస్త్రం ప్రకారం చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందో తెలుగులో ఓ చక్కటి సామెత ఉంది. రాష్ట్రం తీవ్రంగా ఉన్న చికున్ గన్యా జ్వరాల విషయంలో ప్రభుత్వ ఉదాసీనతను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. మామూలు ప్రకటనలకు మీడియా ప్రధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన డాక్టర్ల బృందాన్ని టిడిపి కార్యాలయానికి ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాలో ప్రచారానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు డాక్టర్లతో సమావేశాన్ని టీవీ ఛానళ్ళ వారు వచ్చే వరకు ప్రారంభించలేదు. తీరా కెమెరాలు మైకులు వచ్చిన తర్వాత ఆయన చికున్ గున్యా గురించి మాట్లాడమని డాక్టర్లను కోరారు. ఈ వ్యాధి ప్రమాదకరమైనదేమీ కాదని, నాలుగు రోజులు జ్వరం, నాలుగు వారాల పాటు కీళ్ళ నొప్పులు ఉంటాయని, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయని డాక్టర్లు చెప్పడంతో చంద్రబాబు నాయుడు మొహం మాడిపోయింది. మీడియా ద్వారా అభాసు పాలు కాకుండా ఉండడానికి ఆయన మాట మార్చి గ్రామాలకు వెళ్ళి ఆరోగ్య శిబిరాలు నిర్వహించవలసిందిగా ఆ డాక్టర్లకు సూచింది చేతులు దులుపుకున్నారు.
కృష్ణ
కుమార్తె
మంజుల
నిర్మాతగా
బిజీ
నాగ్-
టబులది
పవిత్ర
బంధం:
అమల