హోంపేజి
తెలుగు సినిమా జీవులకు రియల్ఎస్టేట్ విషయంలో ఆదర్శప్రాయుడు ఒకనాటి హీరో శోభన్బాబే. భూములపై పెట్టుబడుల విషయంలో తనకు శోభన్బాబే ఆదర్శప్రాయుడని మురళీమోహన్ ఇటీవల ప్రకటించారు. అలనాటి హీరోలు ఎన్టీఆర్, అక్కినేని కంటే శోభన్బాబు రియల్ఎస్టేట్ రంగంలో తెలివిగా పెట్టుబడులు పెట్టారు. చెన్నైలో ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు 2 వేల కోట్ల రూపాయలను దాటిపోయినట్టు సమాచారం.
చెన్నైలోనే స్ధిరపడిన శోభన్బాబు నట జీవితానికి ఫుల్స్టాప్ పెట్టి ఆస్తుల సంరక్షణ, నిర్వహణకు ఫుల్టైం వెచ్చిస్తున్నారు. జయలలితతో సాన్నిహిత్యం ఉన్న కాలంలో ఆయన అనేక వివాదాస్పద ఆస్తులను కొనుగోలు చేసి ప్రభుత్వం ద్వారా క్లియర్ చేసుకున్నారని చెబుతారు. స్టెర్లింగ్ రోడ్లోని శోభన్ కాంప్లెక్స్ విలువే రూ 600 కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో సినీజీవులు కూడా శోభన్బాబును ఆదర్శంగా తీసుకుని పోటీలు పడి స్ధలాలు కొనుగోలు చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున వంటి వారు హైదరాబాద్లో హాట్ ఏరియా అయిన గచ్చిబౌలి చుట్టూ ఎకరాల్లో పొలాలు కొనుగోలు చేసినట్టు సమాచారం.
కోక్
బ్రాండ్
అంబాసిడర్గా
రాధిక
మాడుగుల
ఒకప్పుడు
జూనియర్
ఆర్టిస్టు