కాంగ్రెస్ ప్లీనరీ: కొన్ని సంగతులు
పేదల వ్యతిరేక విధానాలు అనుసరించిన చంద్రబాబు నాయుడు పదవి కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆయనను మరో ఐదేళ్ళవరకూ జనం నమ్ముతారన్న నమ్మకం పరిశీలకులకు కలగడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వల్ల అధికారం కోల్పోయి, ఆ తర్వాత ప్రాణం కూడా కోల్పోయిన తెలుగువారి ఆరాధ్య నటుడు, మహా నాయకుడు ఎన్టీఆర్ మీ ఇంకా తెలుగు ప్రజల అభిమానం చెక్కు చెదరలేదు. జాతీయ న్యూస్ ఛానల్ సిఎన్ఎన్-సిబిఎన్ నిర్వహించిన సర్వేలో ప్రముఖ తెలుగు వ్యక్తిగా సీనియర్ ఎన్టీ రామారావుకు అత్యధిక ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో 70 శాతం ఎన్టీఆర్కు రాగా, 23 శాతం ఓట్లతో చిరంజీవి రెండో స్ధానంలో ఉన్నారు. మూడో స్ధానంలో ఉన్న పుట్టపర్తి సాయిబాబాకు 2.6 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. సాయిబాబా తర్వాతి స్ధానం సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజుది. ఆయనకు 1.7 శాతం ఓట్లు వచ్చాయి. సానియా మీర్జా, ఒస్మాన్ అలీఖాన్ తదుపరి స్ధానాల్లో ఉన్నారు. చనిపోయిన పదేళ్ళ తర్వాత కూడా నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఉండడం ఆయన వ్యక్తిత్వానికి, పూర్వ జన్మ సుకృతానికి నిదర్శనం.