కాంగ్రెస్ ప్లీనరీ: కొన్ని సంగతులు
హోంమంత్రి జానారెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే కాదు ఇతరులకు కూడా అర్ధం కాదన్న ఛలోక్తి ఉంది. హోంమంత్రిగా అదే ఆయన బలమన్న వాదన కూడా ఉంది. నక్సలైట్ల టార్గెట్లోకి వెళ్లకూడదన్నది ఆయన అభిమతంగా కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు జానారెడ్డి హాయిగా సినిమా చూస్తూ కూర్చున్నారు. తన శాఖను మార్చమని ఆయన ముఖ్యమంత్రిని గతంలోనే కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇలా ఉండగా కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్తో సమావేశం కావడానికి ఇటీవల ఢిల్లీ వెళ్ళిన ఆయన అక్కడ మూడు రోజుల పాటు అనధికారికంగా ఉన్నారు. రాష్ట్రంలో మావోయిస్టులు ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారోనని పోలీసు శాఖ కంగారు పడుతుండగా హోంమంత్రి ఢిల్లీలో విందు వినోదాల్లో పాల్గొంటూ రోజులు గడపడం విమర్శలకు దారి తీసింది. ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి ఇచ్చిన మూడు విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన తనకు హోం శాఖ ఇష్టం లేదన్న సంకేతాలను ముఖ్యమంత్రికి మళ్ళీ పంపినట్టయింది. ఎమ్మార్వో పోస్టుకు మళ్ళీ తాసిల్దారు అన్న పేరు పెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను కూడా జానా తీవ్రంగా వ్యతిరేకించారు.
త్రిషకు
చిరంజీవి
హితబోధ!
వైఎస్
జగన్
-
కెవిపిల
మధ్య
లడాయి?