వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews
భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ ప్రవర్తన అసౌరభవమేనని డెయిలీ టెలిగ్రాఫ్‌ పత్రిక వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) నివేదికలను అనుసరించి డెయిలీ టెలిగ్రాఫ్‌ వివిధ క్రికెట్‌ జట్ల వ్రపర్తనపై కొన్ని వాస్తవాలను వెల్లడించింది. నిజానికి మైదానంలో అతి హీనంగా ప్రవర్తించే జట్టుగా ఆస్ట్రేలియాకు పేరుంది. కంగారూలు తమ బూతులతో, అవమానకరమైన వ్యాఖ్యలతో ఎదురు జట్లను కించపరుస్తారని క్రీడా ప్రేక్షకులు అనుకుంటారు. హీన ప్రవర్తనలో పాకిస్థాన్‌, భారత్‌ జట్లకే మొదటి రెండు స్థానాలు దక్కుతాయని డెయిలీ టెలిగ్రాఫ్‌ వెల్లడించింది. పాక్‌ జట్టుపై 53 సార్లు, భారత్‌ జట్టుపై 44 సార్లు అంపైర్లు ఫిర్యాదు చేశారట. ఆసీస్‌కు నాలుగో స్థానం దక్కింది. కెప్టెన్ల విషయానికి వస్తే గంగూలీ, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ల కన్నా కంగారూల కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ నయమట. వీరిద్దరిపై పన్నెండేసి సార్లు ఫిర్యాదులు వెళ్లాయట. పాంటింగ్‌పై ఏడు సార్లే ఫిర్యాదులు చేశారట. వెస్టిండీస్‌ మాత్రం ప్రవర్తనలో అత్యుత్తమ స్థానాన్ని దక్కిచుకుంది. జట్టులందు వెస్టిండీస్‌ జట్టు వేరయా అని డెయిలీ టెలిగ్రాఫ్‌ ప్రకటించింది. ఈ జట్టుకు సత్ప్రవర్తనలో మొదటి స్థానం దక్కింది. ప్రస్తుత వెస్టిండీస్‌ కెప్టెన్‌ బ్రియాన్‌ లారా కెప్టెన్లలో మర్యాదాపురుషోత్తముడుగా పేరు పొందాడు. ఆటలోనే కాదు, ప్రవర్తనలోనూ లారాకు అగ్రస్థానం దక్కడం మెచ్చుకోదగిందే.

సెక్సీ వుమెన్‌ లిస్టులో సానియా
కొత్త వేషానికి కెసిఆర్‌ రెడీ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X