హోంపేజి
సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అవకాశవాదాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఔరా అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు కాగితాలు చేత్తో పట్టుకుని చంద్రబాబు చుట్టూ తిరిగిన ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడయ్యారు. కేబినెట్ ర్యాంక్ ఉన్న ఆ పదవిలో రెండేళ్ళు ఆనందంగా గడిపారు. మొద టి నుంచి తాను కమ్యూనిస్టునని చెప్పుకునే పరుచూరి ఎర్ర కండువా లేకుండా ఏ సభకూ హాజరయ్యేవారు కాదు. చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్నప్పుడు పసుపు పచ్చ కండువా ధరించేవారు. ఇప్పుడు మళ్ళీ తన ఇంటి మీద ఎర్రజెండా ఎగరేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పచ్చి అవకాశవాద కమ్యూనిస్టులు పుడతారని ఊహించి ఉంటే కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారీ విధానాన్నే సమర్ధించి ఉండేవారేమో. మురళీమోహన్ లాంటి వారు ఎటువంటి రంగులు మార్చకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.
నన్నపనేని
రాజకుమారి
కమాల్
పోలీసుల
మాట
వినని
ఖైరతాబాద్
వినాయకుడు