వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రజాస్వామ్య వ్యవస్ధలో న్యాయ విభాగానికి ఉన్న పవర్‌ అందరికీ తెలిసిందే. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు జయలలిత వంటి వారిని న్యాయ వ్యవస్ధ న్యాయంగా ముప్పతిప్పలు పెట్టింది. గొప్ప అధికారం చెలాయించే రాజకీయ నాయకులకు చెక్‌ పెట్టడానికి మన రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్ధకు విశేష అధికారాలను కట్టబెట్టారు. మన హైకోర్టు న్యాయమూర్తి పిఎస్‌ నారాయణ ఇటీవల ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి, పిసిసి అధ్యక్షుడు కేశవరావుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుని కూర్చున్న తరుణంలో ఒక విశేషం జరిగింది. తన కుమారుడి పెళ్ళికి రావలసిందిగా జస్టిస్‌ నారాయణ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి ఆహ్వానించినట్టు తెలిసింది. స్వతహాగా కోపిష్టి అయిన వైఎస్‌ నారాయణను సాదరంగా ఆహ్వానించి ఆయనతో చాలా సేపు మాట్లాడడం విశేషం. న్యాయవ్యవస్ధ అంటే తనకు ఎంతో గౌరవమని సిఎం ఆయనతో చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం విషయంలో జస్టిస్‌ నారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, స్ధానిక సంస్ధల ఎన్నికలను నిలిపివేయాలని తీర్స్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రతిపక్ష పార్టీకి మేలు చేసేదిగా ఉందని వైఎస్‌ చేసిన వ్యాఖ్యలను జస్టిస్‌ నారాయణ సీరియస్‌గా తీసుకుని, అది కోర్టు ధిక్కారం ఎందుకు కాదో చెప్పవలసిందిగా షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా జస్టిస్‌ నారాయణ శుభలేఖ ఇవ్వడానికి వైఎస్‌ను కలుసుకోవడం ఒక విశేషమైతే, ఆయన కార్డు ఇచ్చి వెళ్ళిన మరుసటి రోజే ఆయన జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు వైఎస్‌ చేతికి అందాయట.

త్రిషకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన వీడియో క్లిప్స్‌
దేశమంతటా చంద్రబాబు మాల్స్‌?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X