హోంపేజి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిరకాల మిత్రుడు డాక్టర్ కెవిపి రామచంద్రరావు ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లోకి వస్తుంటారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రాకుండా సోనియాగాంధీ అడ్డుకున్నా, రాష్ట్రంలో ఆయన హవాను ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. నామినేటెడ్ పోస్టుల నుంచి, కాంట్రాక్టుల మంజూరు వరకు ఆయనదే హవా. తమిళనాడులో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె నెచ్చెలి శశికళ ఎలాగైతో చక్రం తిప్పారో ఇక్కడ ఇప్పుడు రామచంద్రరావు కూడా అంతే. వైఎస్ హవా ఇటీవల హైకమాండ్ వద్ద తగ్గడంతో కెవిపి ఆలోచనల మూటలతో ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్ర నాయకులను ప్రసన్నులను చేసినట్టు తెలుస్తోంది. ఐడియాస్ డాట్కామ్ అయిన ఎంపీ ఉండవల్లి అరుణకుమార్తో కలిసి ఆయన రాష్ట్రంలోని పరిస్ధితులను, రెండు పత్రికలు వైఎస్ ప్రభుత్వంపై కక్షకట్టిన విషయాన్ని దిగ్విజయ్ సింగ్కు పూసగుచ్చినట్టు వివరించారట. పనిలో పనిగా ఢిల్లీలో ఉన్న కొందరు సీనియర్ పాత్రికేయులను కూడా కెవిపి ప్రసన్నం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని కెవిపి ఢిల్లీలో విజయవంతంగా ప్రచారం చేయగలిగారు. ప్రతినెలా కెవిపి రామచంద్రరావు ఢిల్లీకి మాటల మూటలను మోసుకెళ్ళడం మామూలేనని ఇందులో విశేషం ఏమీలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగుదేశంలో
పేర్వారం,
కాంగ్రెస్లో
దినేష్రెడ్డి?
చర్చి
స్ధలం
కోసం
వైఎస్
సతీమణి
అన్వేషణ?