వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ పేర్వారం రాములు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం హయాంలో ఆయన సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ముగ్గురు మాజీ ఐపిఎస్‌ అధికారులు ఉన్నారు. వారు సిబిఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు, మాజీ ఐజీలు రావులపాటి సీతారామారావు, చంద్రశేఖరరెడ్డి. ప్రముఖ గ్య్రాస్టో ఎంటరాలజిస్టు డాక్టర్‌ సిఎల్‌ వెంకటరావు ఇటీవల టిడిపిలో చేరి కృష్ణాజిల్లా ముదినేపల్లి నియోజకవ ర్గం ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇంత మంది మాజీ అధికారుల సేవలను తెలుగుదేశం పార్టీ అధినేత ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. సీతారామారావు రోజూ పార్టీ కార్యాలయానికి వెళ్ళి క్రియాశీలకంగా ఉన్నారు. చంద్రశేఖరరెడ్డి మాత్రం అప్పుడప్పుడు టిడిపిని వెనకేసుకుని వస్తూ టీవీ ఛానల్స్‌లో కనిపిస్తున్నారు. ఇలా ఉండగా ఆర్టీసీ ఎండీగా నియమితులైన మరో ఐపిఎస్‌ అధికారి దినేష్‌రెడ్డి తన పదవీకాలం ముగిసాక కాంగ్రెస్‌ పార్టీలో చేరి నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. టిడిపి హయాంలో ప్రాధాన్యం లేని పోస్టులకే పరిమితమైన ఆయన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెండు ప్రధాన పదవులు చేపట్టారు.

చర్చి స్ధలం కోసం వైఎస్‌ సతీమణి అన్వేషణ?
ఢిల్లీకి వైఎస్‌ మిత్రుడి మాటల మూటలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X