హోంపేజి
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ చర్చి నిర్మాణం కోసం మణికొండలో ఐదు ఎకరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ తదితరులు విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మణికొండ ప్రాంతంలో ఇప్పుడు భూముల రేట్లు అధికంగా ఉన్నాయి. సినీ వర్కర్స్ కాలనీ చిత్రపురి ఈ ప్రాంతంలోనే నిర్మాణంలో ఉంది. ఇక్కడి లోటస్ పాండ్ స్కూలులో ప్రతి ఆదివారం జరిగే క్రీస్తు ప్రార్ధనలు వైఎస్ సతీమణి వస్తుంటార ని, అక్కడ ఐదు ఎకరాలను సేకరించి చర్చి నిర్మించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. అమాయక రైతుల నుంచి తక్కువ ధరకు భూమిని సేకరించాలనుకుంటున్నారని ఆయన ఆరోపించడంతో ఆ ప్రాంత రైతులు భయభ్రాంతులవుతున్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబం చాలా ఏళ్ళ క్రితమే క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తన రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదన్న ఉద్దేశంతో వైఎస్ చర్చిలకు వెళ్ళకుండా జాగ్రత్త పడుతుండగా, ఆయన సతీమణి మాత్రం క్రైస్తవ మత ప్రార్ధనలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు.
ఢిల్లీకి
వైఎస్
మిత్రుడి
మాటల
మూటలు
తెలుగుదేశంలో
పేర్వారం,
కాంగ్రెస్లో
దినేష్రెడ్డి?