వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంపేజి

By Staff
|
Google Oneindia TeluguNews

గాయని శోభారాజ్‌తో ఉన్న తగాగాల కారణంగానే సహస్రావాధాని మాడుగుల నాగఫణిశర్మ ట్రాప్‌లో ఇరుక్కున్నారా? అవుననే అంటున్నారు హైదరాబాద్‌లోని సాంస్కృతిక సంఘాల నాయకులు కొందరు. హైటెక్‌ సిటీ వద్ద నాగఫణిశర్మకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటిన్నర ఎకరాల స్ధలం ఇవ్వగా, ఆయన పక్కనే ఉన్న మరో ఒకటిన్నర ఎకరాల స్ధలాన్ని కబ్జా చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

కబ్జా చేసుకున్న స్ధలం అన్నమాచార్య కీర్తనల స్పెషలిస్టు శోభారాజ్‌కు సంబంధించిన వారిదని తెలుస్తోంది. అమెరికాలో నాగఫణిశర్మ బస చేసిన ఇల్లు శోభారాజ్‌ సన్నిహితులది కావడంతో ఇప్పడి సాంస్కృతిక సంఘాల నిర్వాహకుల్లో అనుమానాలు చెలరేగాయి. నాగఫణి శర్మ పడగ నీడ నుంచి ఆ స్ధలాన్ని కాపాడుకోవాలంటే ఆయన పరువు తీయడం ఒక్కటే మార్గమని ఆయన ప్రత్యర్ధులు వ్యూహరచన చేసినట్టు ఇక్కడి వారు భావిస్తున్నారు. అయితే నాగఫణిశర్మ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న అమెరికన్‌ డిటెక్టివ్స్‌ మరి కొన్ని రోజుల్లో నివేదిక సమర్పించే అవకాశముంది. సాధారణంగా అమెరికన్‌ డిటెక్టివ్‌లు ప్రలోభాలకు లొంగరు కాబట్టి నిజానిజాలు బట్టబయలయ్యే అవకాశముంది. నాగఫణిశర్మ ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించారన్న అభియోగం వచ్చిన కార్యస్ధలానికి చెందిన కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలున్నాయని, తప్పు శర్మదేనని కొందరు గట్టిగా వాదిస్తున్నారు.

శోభన పురుష ద్వేషం దేనికి సంకేతం?
ఎన్నారై మధు యాష్కి అతితెలివి రాజకీయం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X