రమ్యకృష్ణ-కృష్ణవంశీలు
సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు పెటాకులు కావడానికి ఎంతో కాలం పట్టదు. హాయిగా కాపురం చేసుకుంటున్న సినిమా జంటల సంఖ్య తక్కువే. రమ్యకృష్ణ-కృష్ణవంశీలు పెళ్ళి చేసుకున్నారు గానీ ఇప్పుడు ఆమె చెన్నైలో, ఈయన హైదరాబాద్లో ఉంటున్నారు. కొడుకు పుట్టిన తర్వాత చెన్నై వెళ్ళిన రమ్యకృష్ణ మళ్ళీ హైదరాబాద్ తిరిగిరాలేదని సినీవాలల కథనం. చక్రం సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా దాని బిజినెస్లో కూడా వేలు పెట్టడం వల్ల కృష్ణవంశీ చేతులు కాలాయి. అప్పటికే అప్పుల్లో ఉన్న ఆయన ఈ దెబ్బకు మరింత ఊబిలో కూరుకు పోయాడు. రమ్యకృష్ణ, కృష్ణవంశీల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలతో పాటు ఆర్ధిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. రమ్యకృష్ణ చెన్నైలో ఉండి, జెమిని టీవీ కోసం బంగారం మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఇక్కడ కృష్ణవంశీ చార్మిని పెట్టుకుని వరుసగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. చార్మి హీరోయిన్గా ఆయన తీసిన శ్రీ ఆంజనేయం చక్రం సినిమాలు ఫ్లాప్ అయినా తాజాగా ఎన్టీఆర్ సినిమా రాఖీకి దర్శకత్వం వహిస్తున్న కృష్ణవంశీ చార్మికి ఇందులోనూ ప్రధాన హీరోయిన్ పాత్రను ఇప్పించుకోగలిగారు. వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు టాక్ఆఫ్ది ఇండ్రస్టీగా మారింది.