వైఎస్ సూట్కేస్- ఒక కథ
నా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోంది. దానిని సహించేది లేదు అని గత ఏడాది హడావుడి చేసిన విజయశాంతి ఆ తర్వాత చల్లబడిపోయింది. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా నిన్న హైదరాబాద్లో ప్రత్యక్షమైన ఆమె టిఆర్ఎస్ నాయకుడు నరేంద్రతో కలిసి బోనాల పండుగలో పాల్గొనడం విశేషంగా వార్తల్లోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోదని నిన్న కూడా గట్టిగా చెప్పిన విజయశాంతి టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు మీద కూడా విమర్శల జల్లులు కురిపించింది. ఆమె చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్లో బసచేసిన తాజ్ రెసిడెన్సీ హోటల్కు కేంద్రమంత్ర నరేంద్ర స్వయంగా వెళ్ళి ఆమెను బోనాల ఉత్సవానికి తోడ్కోని వెళ్ళడం చంద్రశేఖరరావుకు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. బిజెపి-నరేంద్ర-విజయశాంతి మధ్య ఉన్న గూడుపుఠాణీ ఎవరికీ స్పష్టంగా అర్ధం కావడం లేదు. త్వరలో నరేంద్ర, విజయశాంతి తమ సొంతగూడు అయిన బిజెపిలో చేరే అవకాశాలు లేకపోలేదు.
కాపునాడులో
విభేదాలు-
టిడిపిలో
హర్షం